AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లేడీ కానిస్టేబుల్ మృతి కేసులో కొత్త ట్విస్ట్..

విశాఖపట్నం లేడీ కానిస్టేబుల్ భవానీ అనుమానాస్పద మృతి కేసులో మరో ట్విస్ట్ వెలుగుచూసింది. భవానీని దారుణంగా హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు పోలీసులు నిర్ధారించారు.

లేడీ కానిస్టేబుల్ మృతి కేసులో కొత్త ట్విస్ట్..
Balaraju Goud
|

Updated on: Nov 09, 2020 | 5:45 PM

Share

విశాఖపట్నం లేడీ కానిస్టేబుల్ భవానీ అనుమానాస్పద మృతి కేసులో మరో ట్విస్ట్ వెలుగుచూసింది. భవానీని దారుణంగా హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ఘాతుకానికి పాల్పడింది భర్తనే తేల్చారు. ఆమెను తాళికట్టిన భర్తే హంతకుడని పోలీసులు నిర్ధారించారు. భవానీని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు భర్త సింహాద్రి ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు.

ఇదిలావుంటే, విశాఖపట్నం పరిధిలోని నక్కపల్లి ఫోలీస్ క్వార్టర్స్ లో ఈనెల 7న తేదీని నాగళ్ల భవానీ అనే మహిళా కానిస్టేబుల్ దారుణ హత్యకు గురైంది. ఆమె తలపై బలంగా మోది.. మెడకు ఉరి బిగించి హతమార్చాడు. అనంతరం మృతదేహాన్ని ఉరికి వేలాడదీసిన భర్త.. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు నాగళ్ల సింహాద్రి. వివాహేతర సంబంధం బయటపడటంతో మానస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని పోలీసులను నమ్మించే ప్రయత్నం చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో పలు అనుమానాలు వ్యక్తమవడంతో ఈ కేసును వైజాగ్ పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. పోలీసుల విచారణలో భాగంగా సింహాద్రి వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

సింహాద్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన రీతిలో విచారణ జరపగా, వివాహేతర సంబంధమని అనుమానంతో ఆమెపై తీవ్ర అక్కసు పెంచుకున్నాడు భర్త సింహాద్రి. పిల్లలను పట్టించుకోవడం లేదని ఎలాగైనా భార్య భవానీని హంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. దీంతో పక్కా ఫ్లాన్ చేసి భవాని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. కాగా, నిందితుడు సింహాద్రిని అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

also read:ఇద్దరు కుమార్తెలతో సహా గోదావరిలో దూకిన తల్లి.. ఒకరు గల్లంతు..!