దేశవ్యాప్తంగా ఈ నెల 29 నుంచి దేవి శరన్నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ నటులు, పశ్చిమ బెంగాల్ ఎంపీలు నుస్రత్ జహాన్, మిమీ చక్రబర్తులతో దుర్గా మాత ఉత్సవాలకు సంబంధించి ఒక పాటను చిత్రీకరించారు. ఇక ఇందులో వారితో పాటు మరో బెంగాలీ నటి శుభ శ్రీ గంగూలీ కూడా కలిసి పాదాలు కలిపారు.
బెంగాలీలో తెరకెక్కిన ‘ఆశే మా దుర్గాశే’ అనే పాటకు ఈ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ఇద్దరూ కూడా శాస్త్రీయ నృత్యంతో అదరగొట్టారు. దుర్గామాత పూజా సాంగ్-2019 పేరుతో కెప్టెన్ టీఎంటీ ఈ పాటను ఫేస్ బుక్ ద్వారా షేర్ చేశారు. సోమవారం ఈ వీడియోను షేర్ చేయగా 1.6 మిలియన్ల మందికిపైగా ఈ వీడియో సాంగ్ ను వీక్షించారు.