ఎంపీ రఘురామకృష్ణం రాజు కీలక నిర్ణయం.. రామ మందిర నిర్మాణానికి..

| Edited By:

Jul 20, 2020 | 3:04 PM

అయోధ్యలోని రామాలయం నిర్మాణానికి సర్వం సిద్ధమైంది. ఆగష్టు 5వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ రామాలయ నిర్మాణానికి భూమి పూజ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అయోధ్యలోని రామాలయ నిర్మాణానికి..

ఎంపీ రఘురామకృష్ణం రాజు కీలక నిర్ణయం.. రామ మందిర నిర్మాణానికి..
MP Raghu Ramakrishna Raju
Follow us on

అయోధ్యలోని రామాలయం నిర్మాణానికి సర్వం సిద్ధమైంది. ఆగష్టు 5వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ రామాలయ నిర్మాణానికి భూమి పూజ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అయోధ్యలోని రామాలయ నిర్మాణానికి తన మూడు నెలల జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు మూడు లక్షల 96 వేల రూపాయల చెక్కును శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర పేరుకు రాసినట్టు ట్వీట్ చేశారు. రామాలయ నిర్మాణానికి ఇది తాను చేస్తున్న ఉడత సాయమని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు రఘురామకృష్ణం రాజు. అలాగే ఈ ట్వీట్‌ను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాజ్‌నాథ్ సింగ్, అమిత్‌ షాలకు ట్యాగ్ చేశారు.

Read More: 

బద్ధలైన అగ్ని పర్వతం.. మొదటిసారిగా కెమెరాకు చిక్కిన దృశ్యాలు

డిశ్చార్జ్ తర్వాత పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటంటే..