అయోధ్యలోని రామాలయం నిర్మాణానికి సర్వం సిద్ధమైంది. ఆగష్టు 5వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ రామాలయ నిర్మాణానికి భూమి పూజ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అయోధ్యలోని రామాలయ నిర్మాణానికి తన మూడు నెలల జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు మూడు లక్షల 96 వేల రూపాయల చెక్కును శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర పేరుకు రాసినట్టు ట్వీట్ చేశారు. రామాలయ నిర్మాణానికి ఇది తాను చేస్తున్న ఉడత సాయమని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు రఘురామకృష్ణం రాజు. అలాగే ఈ ట్వీట్ను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్, అమిత్ షాలకు ట్యాగ్ చేశారు.
Contributed my 3 months MP salary to Ayodhya Ram temple on the occasion of foundation stone ceremony on 5th august by Honourable PM Shri @narendramodi Ji. It is a small support like ? in the Lord Rama war against Lanka. JAI SHRI RAM ?@AmitShah Ji@rajnathsingh Ji@JPNadda Ji pic.twitter.com/iq0nJH7ziA
— K Raghu Rama Krishna Raju (@RaghuRaju_MP) July 20, 2020
Read More:
బద్ధలైన అగ్ని పర్వతం.. మొదటిసారిగా కెమెరాకు చిక్కిన దృశ్యాలు