మహారాష్ట్రను భారీ వర్షాలు ముంచెతుతున్నాయి. దీంతో రాష్ట్రం మొత్తం అతలాకుతలమవుతోంది. కాగా వర్షాలతో ఎగువ నుంచి నీరు రావడంతో రత్నగిరిలోని తివారీ ఆనకట్టకు గండి పడింది. దీంతో దిగువనున్న ఏడు గ్రామాలను నీరు చుట్టుముట్టింది. దాదాపు 16మంది గల్లంతు అయినట్లు తెలుస్తుండగా.. ఆరుగురు మరణించారు. అందులో ఇద్దరి మృతదేహాలను అధికారులు వెలికితీశారు. డ్యాంకు దగ్గరున్న 12 ఇళ్లు నేలమట్టం అయ్యాయి. ఎన్టీఆర్ఎఫ్ బలగాలు, పోలీసులు, వాలెంటీర్లు సహాయక చర్యలను చేపడుతున్నారు.