ప్రజల తీర్పు ఎప్పుడూ గొప్పగానే ఉంటదని వ్యాఖ్యానించారు వైసీపీ నేత, సీనియర్ నటులు మోహన్బాబు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి..జగన్కు ధైర్య సాహసాలతో పాటు ఆశీస్సులు కూడా ఇచ్చారన్నారు. జగన్ సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను తెలుసుకున్నారని చెప్పారు. ప్రజలు జగన్ను ఆశీర్వదించారని ..జగన్ మంచి పాలన అందిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.
ప్రజల తీర్పు ఎప్పుడూ గొప్పదే.. శ్రీ రాజశేఖర్ రెడ్డి గారు తన బిడ్డ జగన్ కి ధైర్య సాహసాలతో పాటు ఆశీస్సులు ఇచ్చాడు. జగన్ 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నాడు. ప్రజలు ఆశీస్సులు అందచేసి ముఖ్యమంత్రిని చేసారు. కచ్చితంగా ప్రజలకు మంచి చేసే ముఖ్యమంత్రి మన జగన్.
— Mohan Babu M (@themohanbabu) May 23, 2019