Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maruti Suzuki price hike: ఏప్రిల్ నుంచి మోతెక్కనున్న కార్ల ధరలు! కారు కొనాలనుకొంటే ఇప్పుడే కొనేయండి..

కొత్త ఆర్థిక సంవత్సరంలో కారు కొనుగోలు చేద్దామని ఆలోచిస్తున్నారా? అయితే మీరు మీ ఆలోచనను మార్చుకోవాల్సిందే? ఎందుకంటే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త నిబంధనలు అమలులోకి వస్తున్నాయి. దాదాపు అన్ని కంపెనీల కార్ల రేట్లు పెరిగే అవకాశం ఉంది.

Maruti Suzuki price hike: ఏప్రిల్ నుంచి మోతెక్కనున్న కార్ల ధరలు! కారు కొనాలనుకొంటే ఇప్పుడే కొనేయండి..
Maruti Suzuki
Follow us
Madhu

|

Updated on: Mar 24, 2023 | 1:06 PM

మీరు కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? మార్చి ముగిశాక, ఏప్రిల్ కొత్త ఆర్థిక సంవత్సరంలో కారు కొనుగోలు చేద్దామని ఆలోచిస్తున్నారా? అయితే మీరు మీ ఆలోచనను మార్చుకోవాల్సిందే? ఎందుకంటే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త నియమ నిబంధనలు అమలులోకి వస్తున్నాయి. దాదాపు అన్ని కంపెనీల కార్ల రేటు కూడా పెరిగే అవకాశం ఉంది. మారుతీ సుజుకీ ఇప్పటికే దీనిపై ఓ ప్రకటన చేసింది. తన అన్ని మోడళ్ల కార్ల ధరలను పెంచనున్నట్లు వివరించింది. కాబట్టి కారు కొనుగోలు చేయాలని ఆలోచిస్తుంటే మీరు ఈ నెలాఖరులోపే కొనుగోలు చేయడం ఉత్తమం.

ద్రవ్యోల్బణాన్ని తగ్గించుకునేందుకు..

మురుతి సుజుకి ఏప్రిల్ ఒకటో తేదీని తన అన్ని మోడళ్ల కార్ల ధరలను పెంచనున్నట్లు గురువారం ప్రకటించింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నియంత్రణ బాధ్యతల ప్రభావాన్ని తగ్గించే లక్ష్యంతో ఈ మేరకు నిర్ణయాన్ని తీసుకున్నట్లు వెల్లడించింది. అయితే ఎంత మేరకు ధర పెరుగుతుందన్న విషయాన్ని కంపెనీ స్పష్టంగా చెప్పలేదు. అయితే అంతకంతకూ పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకుకోనేందుకు ధరల పెంపు అనివార్యమవుతోందని మాత్రం చెప్పింది. ఈ సందర్భంగా కంపెనీ మార్కెటింగ్ అండ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలులోకి వచ్చే ఆర్డీఈ నిబంధన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.కార్ల తయారీలో కీలకంగా ఉన్న మెటీరియల్ ధర పెరుగుల కారణంగా మారుతి సుజుకి 2021 జనవరిలో ధరల పెంపును చేపట్టిందన్నారు. ఇప్పుడు తప్పనిసరిర పరిస్థితుల్లో మళ్లీ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించారు. కొత్తగా ఆధునికీకరించిన మోడళ్లను ఈ నిబంధనలకు అనుగుణంగానే తీసుకొస్తున్నట్లు వివరించారు.

బుకింగ్స్ ప్రారంభం..

ఇదిలా ఉండగా, మారుతి సుజుకి తన పాపులర్ కాంపాక్ట్ ఎస్యూవీ బ్రెజ్జా సీఎన్జీ వేరియంట్ కోసం బుకింగ్‌లను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఆసక్తి గల కస్టమర్‌లు రూ. 25,000 టోకెన్ మొత్తాన్ని చెల్లించి వాహనాన్ని బుక్ చేసుకోవచ్చు . నివేదికల ప్రకారం, డెలివరీలు మూడు నుంచి నాలుగు నెలల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. జనవరిలో జరిగిన ఆటో ఎక్స్‌పో 2023లో బ్రెజ్జా సిఎన్‌జిని మారుతి సుజుకి తొలిసారిగా ఆవిష్కరించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ నైపుణ్యాలుంటే కోరినంత జీతం..క్యూ కడుతున్న టాప్ కంపెనీలు
ఈ నైపుణ్యాలుంటే కోరినంత జీతం..క్యూ కడుతున్న టాప్ కంపెనీలు
వామ్మో... ఈ ఎద్దు ఏంటి ఇలా దాడి చేస్తోంది.. ?
వామ్మో... ఈ ఎద్దు ఏంటి ఇలా దాడి చేస్తోంది.. ?
అమెజాన్‌కు బిఐఎస్ షాక్.. వేర్‌హౌస్‌పై దాడులు వీడియో
అమెజాన్‌కు బిఐఎస్ షాక్.. వేర్‌హౌస్‌పై దాడులు వీడియో
ఆదాయపు పన్నులో మార్పులు.. రూ.12 లక్షల ఆదాయంపై జీరో ట్యాక్స్‌!
ఆదాయపు పన్నులో మార్పులు.. రూ.12 లక్షల ఆదాయంపై జీరో ట్యాక్స్‌!
ఏప్రిల్‌లో ఐదు గ్రహాల సంచారం.. ఈ మూడు రాశులకు లక్కే లక్కు
ఏప్రిల్‌లో ఐదు గ్రహాల సంచారం.. ఈ మూడు రాశులకు లక్కే లక్కు
ఆయుష్షు ఉన్నంత వరకే.. బిష్ణోయ్‌ హత్య బెదిరింపులపై సల్మాన్‌ వీడియో
ఆయుష్షు ఉన్నంత వరకే.. బిష్ణోయ్‌ హత్య బెదిరింపులపై సల్మాన్‌ వీడియో
చెర్రీ నుంచి బిగ్ సర్‌ప్రైజ్‌.. ఇంకాస్త టైం పడుతుందన్న మోక్షు
చెర్రీ నుంచి బిగ్ సర్‌ప్రైజ్‌.. ఇంకాస్త టైం పడుతుందన్న మోక్షు
స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అలెర్ట్..ఆ సెట్టింగ్స్ మార్చుకోవాల్సిందే.!
స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అలెర్ట్..ఆ సెట్టింగ్స్ మార్చుకోవాల్సిందే.!
చేయని నేరానికి 55 ఏళ్లు జైలు రూ.1200 కోట్లు పరిహారం వీడియో
చేయని నేరానికి 55 ఏళ్లు జైలు రూ.1200 కోట్లు పరిహారం వీడియో
నిత్యానంద బ్యాగ్రౌండ్ ఏంట..? కైలాస దేశానికి వెళ్లాలంటే ఏం చేయాలి
నిత్యానంద బ్యాగ్రౌండ్ ఏంట..? కైలాస దేశానికి వెళ్లాలంటే ఏం చేయాలి