AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వారికి బుద్దినివ్వు దేవుడా….

పాక్ క్రికెటర్లపై టీమిండియా బ్యాట్స్‌మన్ మనోజ్ తివారీ మండిపడ్డారు. ఇతర దేశాల క్రికెట్ బోర్డులు, ఆటగాళ్లపై పాక్ క్రికెటర్లు సోషల్ మీడియాలో చేస్తున్న ఆరోపణలు ద్వేష పూరితంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి పోస్టులు పెట్టేవారికి దేవుడు కాస్త బుద్ధి ప్రసాదించాలని కోరుకున్నారు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రాం ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. అందులో పాక్ మాజీ ఆటగాళ్లు షోయబ్ అక్తర్, వకార్ యోనిస్‌, సల్మాన్ బట్‌ వంటి క్రికెటర్లు చేసిన కొన్ని కామెంట్లను […]

వారికి బుద్దినివ్వు దేవుడా....
Sanjay Kasula
|

Updated on: Jul 29, 2020 | 2:16 AM

Share

పాక్ క్రికెటర్లపై టీమిండియా బ్యాట్స్‌మన్ మనోజ్ తివారీ మండిపడ్డారు. ఇతర దేశాల క్రికెట్ బోర్డులు, ఆటగాళ్లపై పాక్ క్రికెటర్లు సోషల్ మీడియాలో చేస్తున్న ఆరోపణలు ద్వేష పూరితంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి పోస్టులు పెట్టేవారికి దేవుడు కాస్త బుద్ధి ప్రసాదించాలని కోరుకున్నారు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రాం ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. అందులో పాక్ మాజీ ఆటగాళ్లు షోయబ్ అక్తర్, వకార్ యోనిస్‌, సల్మాన్ బట్‌ వంటి క్రికెటర్లు చేసిన కొన్ని కామెంట్లను షేర్ చేశారు.

అంతేకాకుండా ఒక్కసారి పాక్ క్రికెటర్ల కామెంట్లను చూస్తే వారెంత ఈర్ష్య, ద్వేషాలతో రగిలిపోతున్నారో అర్థమవుతుందని అన్నారు. వారందరికీ మంచి బుద్ధి ప్రసాదించాలని ఆ దేవుడిని కోరుకుంటున్నట్లు ఇన్‌స్టాగ్రాం పోస్టులో పేర్కొన్నారు .

Follow Us