ఎగ్జిట్ పోల్స్ వెనుక భారీ కుట్ర – దీదీ
ఎగ్జిట్ పోల్స్ సర్వేలపై వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర విమర్శలు చేశారు. సర్వేల ఆధారంగా అన్ని సంస్థలు దాదాపు 300 సీట్లు గెలిచుకుని బీజేపీనే అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై దీదీ ఫైరయ్యారు. ఎగ్జిట్ పోల్స్ గాసిప్ ను తాను నమ్మనని తేల్చి చెప్పారు. అంతేకాదు ఎగ్జిట్ పోల్స్ వదంతుల్ని బాగా వ్యాపించి.. ఆ సమయంలో వేలాది ఈవీఎంలను తరలించేందుకు కుట్ర చేస్తున్నారని దీదీ ఆరోపించారు. అందుకే […]
ఎగ్జిట్ పోల్స్ సర్వేలపై వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర విమర్శలు చేశారు. సర్వేల ఆధారంగా అన్ని సంస్థలు దాదాపు 300 సీట్లు గెలిచుకుని బీజేపీనే అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై దీదీ ఫైరయ్యారు. ఎగ్జిట్ పోల్స్ గాసిప్ ను తాను నమ్మనని తేల్చి చెప్పారు. అంతేకాదు ఎగ్జిట్ పోల్స్ వదంతుల్ని బాగా వ్యాపించి.. ఆ సమయంలో వేలాది ఈవీఎంలను తరలించేందుకు కుట్ర చేస్తున్నారని దీదీ ఆరోపించారు. అందుకే విపక్ష పార్టీలన్నీ ఏకతాటిపై నిలిచి మతతత్వ శక్తులు అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని మమతా బెనర్జీ హెచ్చరించారు. ఎగ్జిట్ పోల్స్ అనంతరం దీదీ ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
I don’t trust Exit Poll gossip. The game plan is to manipulate or replace thousands of EVMs through this gossip. I appeal to all Opposition parties to be united, strong and bold. We will fight this battle together
— Mamata Banerjee (@MamataOfficial) May 19, 2019