AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాలేగాం పేలుడు కేసు విచారణ వేగవంతం.. కోర్టుకు హాజరుకావాలని ప్రగ్యా సాధ్వీజీకి సమన్లు..

మాలేగాం పేలుళ్ల కేసుకు సంబంధించి బీజేపీ ఎంపీ ప్రగ్యాఠాకూర్ ట్రయల్ కోర్టు విచారణకు హాజరుకావాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. మాలేగాం పేలుడు కేసులో కరోనా వైరస్ మహమ్మారి కారణంగా సుధీర్ఘ కాలం తర్వాత ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు విచారణ ముమ్మరం చేసింది.

మాలేగాం పేలుడు కేసు విచారణ వేగవంతం.. కోర్టుకు హాజరుకావాలని ప్రగ్యా సాధ్వీజీకి సమన్లు..
Balaraju Goud
|

Updated on: Dec 19, 2020 | 1:47 PM

Share

మాలేగాం పేలుళ్ల కేసుకు సంబంధించి బీజేపీ ఎంపీ ప్రగ్యాఠాకూర్ ట్రయల్ కోర్టు విచారణకు హాజరుకావాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. మాలేగాం పేలుడు కేసులో కరోనా వైరస్ మహమ్మారి కారణంగా సుధీర్ఘ కాలం తర్వాత ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు విచారణ ముమ్మరం చేసింది. ఈ కేసులో సాక్షులను పిలవాలని కోర్టు నిర్ణయించింది. ఈ కేసులో నిందితులైన ఏడుగురు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. 2008లో మాలేగాం పట్టణంలోని మసీదు సమీపంలో మోటారుసైకిలులో పేలుడు పరికరం ఉంచి పేల్చారు. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా, మరో వందమంది గాయపడ్డారు. ఈ ఘటనలో ఎంపీ ప్రగ్యాసింగ్ ఠాకూర్ నిందితురాలుగా ఉన్నారు. అయితే, అనారోగ్య కారణాలు చూపిస్తూ ముంబై ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు విచారణకు హాజరుకు మినహాయింపు ఇవ్వాలని ప్రగ్యా ఠాకూర్ కోర్టుకు విన్నవించుకుంది.

ఇదిలావుండగా, ఈ కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ ప్రగ్యాసింగ్ ఠాకూర్, రమేష్ ఉపాధ్యాయ, సుధాకర్ దివేది, సుధాకర్ చతుర్వేదిలు కోర్టుకు హాజరుకాలేదు. కొవిడ్ -19 ఆంక్షల వల్ల వారు కోర్టుకు హాజరు కాలేక పోయారని వారి తరపున న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. దీంతో మళ్లీ డిసెంబరు 19వతేదీన నిందితులందరినీ హాజరుకావాలని కోర్టు మరోసారి సమన్లు జారీ చేసింది. దీంతో ఎంపీ ప్రగ్యాసింగ్ అనారోగ్యంతో ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో చేరారని అతని న్యాయవాది చెప్పారు.

ప్రగ్యా సాధ్వీజీ ముంబైకు రావాలని నిర్ణయించుకొని విమానాశ్రయానికి సమీపంలోని నందగిరి గెస్టుహౌస్ ను బుకింగ్ చేశారని, కాని ఆమెకు రెగ్యులర్ చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్లగా వైద్యులు ఆమెను వెంటనే ఆసుపత్రిలో చేరమని కోరారని ఆమె తరపున న్యాయవాది జేపీ మిశ్రా చెప్పారు. ప్రగ్యా ఠాకూర్ గతంలో ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరి కంటి ఆపరేషన్ చేయించుకున్నారు.