బెంగాల్ లో బీజేపీకి దెబ్బ ! ఎన్డీయేకి గూర్ఖా జన్ ముక్తి మోర్చా గుడ్ బై

ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న గూర్ఖా జనముక్తి మోర్చా తాము ఎన్డీయే నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించింది. తాము అన్నీ ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నామని ఈ సంస్థ అధ్యక్షుడు బిమల్ గురుంగ్ కోల్ కతా లో తెలిపారు. వచ్ఛే ఏడాది జరిగే ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం మమతాబెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మద్దతునిస్తామని ఆయన చెప్పారు. గూర్ఖాలాండ్ ను సాధించాలన్న తమ డిమాండును బీజేపీ తీర్చలేదని ఆయన ఆరోపించారు. ఈ డిమాండును ఎవరు సమర్థించినా […]

బెంగాల్ లో బీజేపీకి దెబ్బ ! ఎన్డీయేకి గూర్ఖా జన్ ముక్తి మోర్చా గుడ్ బై
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 21, 2020 | 8:17 PM

ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న గూర్ఖా జనముక్తి మోర్చా తాము ఎన్డీయే నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించింది. తాము అన్నీ ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నామని ఈ సంస్థ అధ్యక్షుడు బిమల్ గురుంగ్ కోల్ కతా లో తెలిపారు. వచ్ఛే ఏడాది జరిగే ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం మమతాబెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మద్దతునిస్తామని ఆయన చెప్పారు. గూర్ఖాలాండ్ ను సాధించాలన్న తమ డిమాండును బీజేపీ తీర్చలేదని ఆయన ఆరోపించారు. ఈ డిమాండును ఎవరు సమర్థించినా ఆ పార్టీకి తమ మద్దతు ఉంటుందని ఆయన చెప్పారు. 12 ఏళ్ళు గడిచినా తమ కోర్కె నెరవేరలేదన్నారు.  రానున్న ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే తమ ధ్యేయమన్నారు.