AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“మహా”లో కొత్తగా 3,254 మందికి కరోనా పాజిటివ్‌

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. బుధవారం కొత్తగా 3,254 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ.

మహాలో  కొత్తగా 3,254 మందికి కరోనా పాజిటివ్‌
Balaraju Goud
|

Updated on: Jun 10, 2020 | 9:00 PM

Share

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. బుధవారం కొత్తగా 3,254 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 94,041కు పెరిగింది. గడచిన 24 గంటల్లో మరో 149 చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 3,438కు చేరింది. బుధవారం ఒక్కరోజే 1,879 మంది కరోనా డిశ్చార్జ్‌ అయ్యి ఇళ్లకు చేరారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 44,517 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో 46,074 మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. బుధవారం సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా 5,93,784 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించి మహారాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య విషయంలో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనాను మహారాష్ట్ర ఇప్పటికే మించిపోయింది. కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నప్పటికీ కరోనా వైరస్ బారిన పడుతున్న వారు కూడా అంతకంతకు పెరుగుతున్నారు.