వీడియోకాల్లోనే భర్త అంత్యక్రియలకు…ఎంత తల్లడిల్లిందో ఆమె
కరోనా మనుషులపై కనపడకుండా దాడి చేస్తోంది. ప్రపంచంలోని 200 పైగా దేశాలు ఈ మహమ్మారి వైరస్ పై పోరాడుతున్నాయి. మరోవైపు కరోనా కట్టడి చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకచోట నుంచి మరోచోటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఓ మహిళ తన భర్త చనిపోతే కనీసం దగ్గరుండి ఆఖరి చూపు చూడలేకపోయింది అంత్యక్రియలకూ నోచుకోని పరిస్థితి తలెత్తింది. మహారాష్ట్రలో ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. […]
కరోనా మనుషులపై కనపడకుండా దాడి చేస్తోంది. ప్రపంచంలోని 200 పైగా దేశాలు ఈ మహమ్మారి వైరస్ పై పోరాడుతున్నాయి. మరోవైపు కరోనా కట్టడి చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకచోట నుంచి మరోచోటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఓ మహిళ తన భర్త చనిపోతే కనీసం దగ్గరుండి ఆఖరి చూపు చూడలేకపోయింది అంత్యక్రియలకూ నోచుకోని పరిస్థితి తలెత్తింది.
మహారాష్ట్రలో ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. తన భర్త చివరిసారి చూపులకు నోచుకోని ఆ మహిళ.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అంత్యక్రియల్లో పాల్గొనాల్సి వచ్చింది. వాసంతి బండేకర్, చంద్రకాంత్ దంపతులు సింధ్దుర్గ్ జిల్లా, దోడామార్గ్లోని మోర్లే గ్రామంలో నివశిస్తున్నారు. తన కుమారుడు అమిత్ను చూసేందుకు కొన్ని రోజులు వెళ్లారు చంద్రకాంత్. అయితే.. ఆరోగ్య పరిస్థితి బాగోకపోవడంతో మార్చి 22న అక్కడే ఆస్పత్రిలో చేరగా చంద్రకాంత్ కి క్యాన్సర్ అని తేలింది. చికిత్స పొందుతూ ఈ నెల 16న ప్రాణాలు విడిచారు. అయితే ముంబైకి సుమారు 490 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాసంతికి.. లాక్డౌన్ నిబంధనల వల్ల ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే తన భర్త అంత్యక్రియలకు హాజరైంది. లాక్డౌన్ కారణంగా.. తన తండ్రి భౌతికకాయాన్ని సొంత గ్రామానికి తీసుకెళ్లలేకపోయానని, తల్లికి ఆఖరి చూపు కూడా అందించలేకపోయానని కన్నీళ్లు పెట్టుకున్నాడు అమిత్.