ఏపీ ప్రభుత్వం నిర్ణయం.. 3500 స్కూళ్లలో ఎల్‌కేజీ, యూకేజీ..!

ఏపీలోని 3500 ప్రాధమిక పాఠశాలల్లో ఎల్‌కేజీ, యూకేజీలను ప్రవేశపెట్టనున్నారు. దీనికోసం ప్రత్యేక సిలబస్‌ను రూపొందించడంతో పాటు.. ఉపాధ్యాయుల నియామకాలపై పాఠశాల విద్యాశాఖ ప్రణాళికలు సిద్దం చేస్తోంది.

ఏపీ ప్రభుత్వం నిర్ణయం.. 3500 స్కూళ్లలో ఎల్‌కేజీ, యూకేజీ..!

Updated on: Jul 24, 2020 | 6:39 PM

LKG, UKG Education: ఏపీ విద్యావిధానంలో సమూల మార్పులు చేసేందుకు జగన్ సర్కార్ శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఈ ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్‌కేజీ, యూకేజీ విద్యను అమలు చేయాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపధ్యంలో ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోని 3500 ప్రాధమిక పాఠశాలల్లో ఎల్‌కేజీ, యూకేజీలను ప్రవేశపెట్టనున్నారని తెలుస్తోంది. దీనికోసం ప్రత్యేక సిలబస్‌ను రూపొందించడంతో పాటు.. ఉపాధ్యాయుల నియామకాలపై పాఠశాల విద్యాశాఖ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. కాగా, ప్రస్తుతం అంగన్‌వాడీ కేంద్రాలలో ఉన్న పిల్లలను ఈ బడులలోకి తీసుకుని.. వారిని ఒకటో తరగతికి కావాల్సిన విధంగా తీర్చిదిద్దనున్నారు.

Also Read:

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి నెల రోజుల హోం క్వారంటైన్..

ఏపీలో కరోనా విజృంభణ.. ఆ జిల్లాలో 31 వరకు లాక్‌డౌన్‌..!

Loading...
Unable to load recommendations.
Follow Us