కేరళ గోల్డ్‌ స్మగ్లింగ్‌పై విపక్షాల ఆందోళనలు

కేరళలో గోల్డ్‌ స్మగ్లింగ్ కేసు ప్రకంపనలు రేపుతోంది. విపక్షాలు ఆందోళనలను మరింత ఉధృతం చేశాయి. త్రివేండ్రంలో సెక్రటేరియట్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించాయి యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు...

కేరళ గోల్డ్‌ స్మగ్లింగ్‌పై విపక్షాల ఆందోళనలు

Updated on: Sep 17, 2020 | 3:25 PM

కేరళలో గోల్డ్‌ స్మగ్లింగ్ కేసు ప్రకంపనలు రేపుతోంది. విపక్షాలు ఆందోళనలను మరింత ఉధృతం చేశాయి. త్రివేండ్రంలో సెక్రటేరియట్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించాయి యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు. ఈ కేసులో ఈడీ విచారణను ఎదుర్కొన్న మంత్రి జలీల్‌ రాజీనామా చేయాలంటూ ఆందోళన చేపట్టారు. బారికేడ్లను తొలగించడానికి యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు.

పోలీసులకు , ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు . భాష్పవాయువును ప్రయోగించారు. వాటర్‌ కెనాన్లను కూడా ఉపయోగించారు. వందలాదిమంది యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలను పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు.

మరో వైపు విద్యార్థి సంఘాలు జిల్లాల వ్యాప్తంగా ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఫ్లాష్ మాబ్ నిర్వహించారు. వినూత్న తరహాలో కార్యక్రమాలను చేపడుతున్నారు.

Follow Us