ఈ ప్రపంచం హీరోయిన్లను చూసే విధానాన్ని మార్చిన విప్లవాత్మకతల్లికి నివాళులర్పించడం గర్వంగా ఉంది : కంగనా రనౌత్

|

Dec 06, 2020 | 5:56 AM

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, తమిళ తలైవి, అలనాటి ప్రముఖ సినీనటి జయలలిత వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి...

ఈ ప్రపంచం హీరోయిన్లను చూసే విధానాన్ని మార్చిన విప్లవాత్మకతల్లికి నివాళులర్పించడం గర్వంగా ఉంది : కంగనా రనౌత్
Follow us on

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, తమిళ తలైవి, అలనాటి ప్రముఖ సినీనటి జయలలిత వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించింది బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్. ఈ ప్రపంచం నటీమణుల్ని చూసే విధానాన్ని మార్చిన విప్లవాత్మకతల్లికి నివాళులర్పించడం గర్వంగా ఉందని ఈ సందర్భంగా కంగనా పేర్కొంది. కాగా, ఫిబ్రవరి 24, 1948న జన్మించిన జయలలిత డిసెంబరు 5, 2016 న తుదిశ్వాస విడిచారు. రాజకీయాలలోకి రాకముందు తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో సుమారు 140 సినిమాల్లో జయలలిత హీరోయిన్ గా నటించారు. 2016, డిసెంబరు 5, రాత్రి 11:30 గంటలకు చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో జయ మరణించారు.

ఇదిలాఉంటే, కంగనా రనౌత్ తాజాగా జయలలిత బయోపిక్‌(తలైవి)లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన కొన్ని స్టన్నింగ్‌ ఫోటోలను కూడా కంగనా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. మరో వారం రోజుల్లో సినిమా పూర్తికానుందని పేర్కొన్న ఆమె, ఈ సందర్శంగా సూపర్‌ హ్యూమన్‌లా సినిమాను తెరకెక్కిస్తున్న విజయ్‌తోపాటు, తలైవి చిత్ర యూనిట్‌కి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జయలలిత బయోపిక్‌ ‘తలైవి-ది రివల్యూషనరీ లీడర్‌’ లో కంగనా రనౌత్ లీడ్ రోల్ పోషిస్తోంది. షూటింగ్ కార్యక్రమాలను శరవేంగా పూర్తి చేసుకుంటోన్న ఈ సినిమాని హితేష్ ఠక్కర్, తిరుమల్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హిందీ, తమిళం తెలుగు భాషలలో ఈ సినిమా విడుదల కాబోతోంది.