Kanaka Durga Fly Over: విజయవాడకు మణిహారంగా పరిగణించబడుతున్న కనకదుర్గ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలాసార్లు ఫ్లై ఓవర్ ప్రారంభానికి ముహూర్తం పెట్టినా.. అనివార్య కారణాలతో అది వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఈ నెల 16వ తేదీన ఫ్లై ఓవర్ను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నట్లు విజయవాడ ఎంపీ కేశినేని నాని ట్విట్టర్ వేదికగా తెలిపారు. కాగా, అదే రోజున ఏపీలోని పలు రోడ్డు నిర్మాణాలకు కూడా గడ్కరీ భూమి పూజ చేసే అవకాశాలు ఉన్నాయి.
Also Read:
గ్రామ/వార్డు వాలంటీర్లకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..
సోనూసూద్ గొప్ప మనసు.. బాలుడి వైద్యానికి రూ. 20 లక్షల సాయం..
రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. పండగ సీజన్లో 200 స్పెషల్ ట్రైన్స్.!
కనకదుర్గ ఫ్లైఓవర్ ను 16 వ తేదీన కేంద్ర మంత్రి వర్యులు నితిన్ గడ్కరీ గారు ప్రారంభిస్తారు. pic.twitter.com/kyRL9VVwkN
— Kesineni Nani (@kesineni_nani) October 3, 2020