నిర్భయ దోషుల ఉరిశిక్షపై ప్రధాని మోదీ ఏమన్నారంటే..?

| Edited By: Pardhasaradhi Peri

Mar 20, 2020 | 3:02 PM

దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన నిర్భయ హత్యచార,హత్య ఘటన నలుగురు దోషులకు ఎట్టకేలకు ఉరిశిక్ష పడింది. ఈ కేసులో అక్షయ్ సింగ్ ఠాగూర్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, ముఖేశ్ సింగ్ సహా మొత్తం నలుగురు దోషులను శుక్రవారం  తెల్లవారుజామున  5:30 ని‌లకు తీహార్‌ జైల్లో మీరట్ నుంచి వచ్చిన తలారి ఉరితీశారు.  దీంతో నిర్భయ ఘటన జరిగిన ఏడేళ్లకు నిర్భయ తల్లిదండ్రుల కోరిక నెరవేరింది. ఇన్నాళ్ళకైనా చివరకు తమకు న్యాయం జరిగిందని హర్షం వ్యక్తం చేశారు. […]

నిర్భయ దోషుల ఉరిశిక్షపై ప్రధాని  మోదీ ఏమన్నారంటే..?
Follow us on

దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన నిర్భయ హత్యచార,హత్య ఘటన నలుగురు దోషులకు ఎట్టకేలకు ఉరిశిక్ష పడింది. ఈ కేసులో అక్షయ్ సింగ్ ఠాగూర్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, ముఖేశ్ సింగ్ సహా మొత్తం నలుగురు దోషులను శుక్రవారం  తెల్లవారుజామున  5:30 ని‌లకు తీహార్‌ జైల్లో మీరట్ నుంచి వచ్చిన తలారి ఉరితీశారు.  దీంతో నిర్భయ ఘటన జరిగిన ఏడేళ్లకు నిర్భయ తల్లిదండ్రుల కోరిక నెరవేరింది. ఇన్నాళ్ళకైనా చివరకు తమకు న్యాయం జరిగిందని హర్షం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలు పై తొలిసారి తన అధికారిక ట్విట్టర్ లో స్పందించారు. చివరకు న్యాయమే విజయం సాధించిందని ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. మహిళలకు.. కనీస గౌరవం, భద్రతల పై వారికి భరోసా కల్పించడం అన్నింటి కంటే ముఖ్యమైంది అని అన్నారు.అన్ని రంగాల్లోనూ మన దేశ మహిళలు రాణిస్తూ.. వారి శక్తిని చటుతున్నారన్నారు. మహిళా సాధికారత, సమానత్వం, సమాన అవకాశాలకు ప్రాధాన్యత కల్పించే  విధంగా మన దేశాన్ని నిర్మించేందుకు మనమంతా కలిసికట్టుగా పనిచేయాలని ప్రధాని మోదీ తన అధికారిక ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు.