ఇక నుంచి ఈ వేడుకలు నేనే చూసుకుంటా..!

| Edited By:

May 28, 2019 | 12:16 PM

మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు 97వ జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఎన్టీఆర్ ఘాట్‌ని సందర్శించారు. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌ కూడా తాతయ్య సమాధిని సందర్శించారు. ఈ సందర్భంగా పూలతో కళకళలాడాల్సిన సమాధి అలంకరణ లేక బోసి పోవడం చూసి ఇరువురూ అసహనం వ్యక్తం చేశారు. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లే స్వయంగా పూలు తెప్పించి సమాధిని అలంకరించారు. అక్కడే ఉన్న అభిమానుల సాయంతో సమాధి మొత్తం […]

ఇక నుంచి ఈ వేడుకలు నేనే చూసుకుంటా..!
Follow us on

మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు 97వ జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఎన్టీఆర్ ఘాట్‌ని సందర్శించారు. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌ కూడా తాతయ్య సమాధిని సందర్శించారు. ఈ సందర్భంగా పూలతో కళకళలాడాల్సిన సమాధి అలంకరణ లేక బోసి పోవడం చూసి ఇరువురూ అసహనం వ్యక్తం చేశారు. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లే స్వయంగా పూలు తెప్పించి సమాధిని అలంకరించారు. అక్కడే ఉన్న అభిమానుల సాయంతో సమాధి మొత్తం పూలతో కళకళలాడేలా చేశారు. తర్వాత పుష్పగుచ్చాలతో తారక్, కల్యాణ్‌రామ్‌లు నివాళులు అర్పించారు. తాత సమాధి పక్కనే కాసేపు మౌనంగా కూర్చున్నారు. ఇక నుంచి తాత వర్ధంతి, జయంతి వేడుకల ఏర్పాట్లను తానే స్వయంగా చూసుకుంటానని ప్రకటించి జూనియర్ ఎన్టీయార్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.