AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జగన్‌ ‘కాళేశ్వరం’ కౌంటర్ పై కేసీఆర్‌ సీరియస్!

ఏపీ ప్రభుత్వ వైఖరిలో అకస్మాత్తుగా మార్పు రావడంతో తెలంగాణ ప్రభుత్వం కలత చెందుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం తన ప్రధాన ప్రాజెక్టు కాళేశ్వరం కోసం జాతీయ ప్రాజెక్టు హోదా పొందటానికి ప్రయత్నిస్తుండగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిని వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. దీనిని తీవ్రంగా పరిగణించిన సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టులో సమర్పించాల్సిన కౌంటర్ అఫిడవిట్ ను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ప్రాజెక్ట్ పనులను, ప్రాజెక్టును వేగంగా అమలు చేయడంలో ఎదుర్కొంటున్న […]

జగన్‌ 'కాళేశ్వరం' కౌంటర్ పై కేసీఆర్‌ సీరియస్!
TV9 Telugu Digital Desk
|

Updated on: Nov 16, 2019 | 12:06 PM

Share

ఏపీ ప్రభుత్వ వైఖరిలో అకస్మాత్తుగా మార్పు రావడంతో తెలంగాణ ప్రభుత్వం కలత చెందుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం తన ప్రధాన ప్రాజెక్టు కాళేశ్వరం కోసం జాతీయ ప్రాజెక్టు హోదా పొందటానికి ప్రయత్నిస్తుండగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిని వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. దీనిని తీవ్రంగా పరిగణించిన సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టులో సమర్పించాల్సిన కౌంటర్ అఫిడవిట్ ను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే.

ప్రాజెక్ట్ పనులను, ప్రాజెక్టును వేగంగా అమలు చేయడంలో ఎదుర్కొంటున్న చట్టపరమైన అడ్డంకులను సమీక్షించడానికి వచ్చే వారం నీటిపారుదల ఉన్నతాధికారులతో కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మరియు ఉన్నతాధికారులు అందరూ హాజరయ్యారు.

రీ ఇంజనీరింగ్ పేరిట తెలంగాణ కాళేశ్వరం చేపట్టిందని ఏపీ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. “తెలంగాణ విచక్షణారహితంగా పాలమురు – రంగారెడ్డి, దిండి, భక్త రామదాసు లిఫ్ట్ వంటి కొత్త ప్రాజెక్టులను నిర్మిస్తోంది” అని అఫిడవిట్‌లో పేర్కొంది. కృష్ణ బేసిన్లో మొత్తం 180 టిఎంసి అడుగుల నీటిని వినియోగించే పథకం మరియు కాళేశ్వరం, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, తుపాకులగూడెం వంటి ప్రాజెక్టులు అధిక నీటి వినియోగాన్ని కలిగి ఉన్నాయి, ఏపీలో ఈ ప్రాజెక్టులు దిగువ రైతులను మరియు నివాసులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి అని, అందువల్ల కాళేశ్వరంను జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించటానికి వీల్లేదని వాదిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత తెలంగాణ గోదావరి జలాలను ఉపయోగించడంపై కూడా ఏపీ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. పోలవరం ప్రాజెక్ట్ నుండి మళ్లించాలని ప్రతిపాదించిన 80 టిఎంసి అడుగులలో 35 టిఎంసి అడుగులు ఉపయోగించిన తరువాత, మిగిలిన 45 టిఎంసి అడుగుల నీటిని కూడా ఉపయోగించుకునే అర్హత తమకు ఉందని తెలంగాణ పేర్కొంది . తెలంగాణ వాదన తప్పు మరియు నిరాధారమని ఏపీ ప్రభుత్వం వాదించింది. తెలంగాణ నీటిపారుదల ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం లేవనెత్తిన అన్ని అంశాలపై బలమైన కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేస్తామని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.

Follow Us
చైనా-నేపాల్ సరిహద్దులో ఊహించని ప్రళయం.. భయం గొలిపే వీడియో ..
చైనా-నేపాల్ సరిహద్దులో ఊహించని ప్రళయం.. భయం గొలిపే వీడియో ..
23 రోజుల తర్వాత లభించిన ఆచూకీ.. మత్స్యాకారులు సేఫ్
23 రోజుల తర్వాత లభించిన ఆచూకీ.. మత్స్యాకారులు సేఫ్
కొడుకుతో కలిసి ఎంఐఎం సభలో సందడి చేసిన అసదుద్దీన్ ఓవైసీ
కొడుకుతో కలిసి ఎంఐఎం సభలో సందడి చేసిన అసదుద్దీన్ ఓవైసీ
అడవి పందికే చుక్కలు చూపించిన 14 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో!
అడవి పందికే చుక్కలు చూపించిన 14 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో!
శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి
శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి
లైటర్ పనిచేయడం లేదా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!
లైటర్ పనిచేయడం లేదా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!
న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..
న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..
బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..
బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..
కంటిచూపుతో కాదు.. సూటి ప్రశ్నతో చంపేస్తారు! జస్ట్ ఆస్కింగ్ అంటూ వ
కంటిచూపుతో కాదు.. సూటి ప్రశ్నతో చంపేస్తారు! జస్ట్ ఆస్కింగ్ అంటూ వ
సెమీఫైనల్స్‌లో తలపడే 4 జట్లు ఇవే.. దేశవాళీలో ఇక రచ్చరచ్చే..!
సెమీఫైనల్స్‌లో తలపడే 4 జట్లు ఇవే.. దేశవాళీలో ఇక రచ్చరచ్చే..!