రాణా విజృంభణ.. కోల్‌కతా గౌరవప్రదమైన స్కోర్..

|

Oct 29, 2020 | 9:30 PM

దుబాయ్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతోన్న ఐపీఎల్ మ్యాచ్‌లో కోల్‌కతా బ్యాట్స్‌మెన్ ఆచితూచి చక్కటి ఇన్నింగ్స్ ఆడారు. ముఖ్యంగా నితీష్ రాన

రాణా విజృంభణ.. కోల్‌కతా గౌరవప్రదమైన స్కోర్..
Follow us on

IPL 2020: దుబాయ్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతోన్న ఐపీఎల్ మ్యాచ్‌లో కోల్‌కతా బ్యాట్స్‌మెన్ ఆచితూచి చక్కటి ఇన్నింగ్స్ ఆడారు. ముఖ్యంగా నితీష్ రాణా(87) మెరుపు అర్ధ సెంచరీ, ఆఖర్లో దినేష్ కార్తీక్(21) ఫినిషింగ్‌తో కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది.

మిడిల్ ఓవర్లలో నితీష్ రాణా స్పిన్నర్లను టార్గెట్ చేసి బౌండరీల వర్షం కురిపించాడు. అయితే చెన్నై వెంటవెంటనే వికెట్లు తీయడంతో కోల్‌కతా స్కోర్ బోర్డు నెమ్మదించింది. కానీ చివర్లో కార్తీక్(21) మెరుపులు మెరిపించడంతో నిర్ణీత ఓవర్లకు గౌరవప్రదమైన స్కోర్ చేసింది. ఇక చెన్నై బౌలర్లలో ఎనిగిడి రెండు వికెట్లు తీయగా.. శాంట్నార్, జడేజా, కరణ్ శర్మ తలో వికెట్ పడగొట్టారు.