అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఐక్య రాజ్య సమితి కేంద్ర కార్యాలయంపై యోగా డే వేడుకలకు సంబంధించిన లోగోతో.. కళ్లు చెదిరేలా లైటింగ్ను ఏర్పాటు చేశారు. భవనానికి ఓ వైపు యోగా ఆసనాలకు సంబంధించిన సూర్యనమస్కార్ గుర్తులను అద్భుతంగా లైట్స్తో అలంకరించారు. యోగాపై ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక కార్యక్రమానికి ఐక్యరాజ్యసమితి భారత శాశ్వత ప్రతినిధి రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్, ఉప శాశ్వత ప్రతినిధి రాయబారి కె. నాగరాజు నాయుడు, పలువురు దౌత్యవేత్తలు హాజరయ్యారు.
Yoga lights up @UN Headquarters
in the lead up to the 5th International
Day of Yoga at United Nations #YogaDay2019 #yoga4climateaction #IDY2019 @ICCR_Delhi @IndianDiplomacy pic.twitter.com/KynVGIl1C8— India at UN, NY (@IndiaUNNewYork) June 20, 2019