India vs England 2021: నిలకడగా ఆడుతున్న ఇంగ్లాండ్ ఆటగాళ్లు.. 50 ఓవర్లకు ఎంత స్కోరంటే..?

|

Feb 05, 2021 | 1:58 PM

India vs England 1st Test Match, Day 1: చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం ఇండియాతో జ‌రుగుతున్న తొలి టెస్ట్ తొలి సెష‌న్‌లో ఇంగ్లండ్ నిలకడగా ఆడుతోంది. భోజన విరామ సమయానికి ముందు..

India vs England 2021: నిలకడగా ఆడుతున్న ఇంగ్లాండ్ ఆటగాళ్లు.. 50 ఓవర్లకు ఎంత స్కోరంటే..?
Follow us on

India vs England 1st Test Match, Day 1: చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం ఇండియాతో జ‌రుగుతున్న తొలి టెస్ట్ తొలి సెష‌న్‌లో ఇంగ్లండ్ నిలకడగా ఆడుతోంది. భోజన విరామ సమయానికి ముందు వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టు మళ్లీ పుంజుకుంది. ఈ క్రమంలో క్రీజులో ఉన్న ఆటగాళ్లు కుదురుకోవడంతో 50 ఓవర్ల నిర్ణీత సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది. అనుకున్నట్లుగా టీమిండియా బౌలర్లకు చెన్నై పిచ్ సహకారం అందించడం లేదు. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ కాస్త డిఫెన్సివ్‌గా ఉన్నా.. గ్రౌండ్ నలువైపులా రన్స్ మాత్రం రాబట్టుకోగలుగుతున్నారు.

క్రీజులో ప్రస్తుతం.. ఓపెనర్ డొమినిక్ సిబ్లి(49) అర్ధ సెంచరీకి చేరువలో ఉండగా.. కెప్టెన్ జో రూట్(33) అతడికి మంచి సహకారాన్ని అందిస్తున్నాడు. ప్రస్తుతం 50 ఓవర్లు పూర్తయ్యేసరికి ఇంగ్లాండ్ రెండు వికెట్లు నష్టపోయి 122 పరుగులు చేసింది.

 

Also Read:

India vs England, 1st Test, Day 1 LIVE Score: హాఫ్ సెంచరీ చేసిన సిబ్లీ.. మంచి సహకారం అందిస్తోన్న రూట్..

Ind vs Eng 1st Test: తుది జట్టులో కుల్దీప్‌కు నో ఎంట్రీ.. విరాట్‌పై ఫైర్ అవుతున్న ఫ్యాన్స్