ఫ్రాన్స్ అధ్యక్షుడితో మోదీ భేటీ..
విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ గురువారం ఫ్రాన్స్ చేరుకున్నారు. దేశ రాజధాని పారిస్ విమానాశ్రయంలో ఆ దేశ విదేశాంగా మంత్రి మోదీకి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఛాటే డి చంటిల్లీ భవనంలో అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్తో మోదీ సమావేశమయ్యారు. మొదట ఇరువురు అధికార బృందంతో కలిసి భేటీ అయ్యారు. అనంతరం మోదీ, మోక్రాన్లు ఇద్దరు మాత్రమే కాసేపు సమావేశమయ్యారు. ఇవాళ కూడా మోదీ పలు కార్యక్రమాల్లో పాల్గొగననున్నారు. ఫ్రాన్స్లో ఉన్న భారత సంతతి ప్రజలతో […]
విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ గురువారం ఫ్రాన్స్ చేరుకున్నారు. దేశ రాజధాని పారిస్ విమానాశ్రయంలో ఆ దేశ విదేశాంగా మంత్రి మోదీకి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఛాటే డి చంటిల్లీ భవనంలో అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్తో మోదీ సమావేశమయ్యారు. మొదట ఇరువురు అధికార బృందంతో కలిసి భేటీ అయ్యారు. అనంతరం మోదీ, మోక్రాన్లు ఇద్దరు మాత్రమే కాసేపు సమావేశమయ్యారు. ఇవాళ కూడా మోదీ పలు కార్యక్రమాల్లో పాల్గొగననున్నారు. ఫ్రాన్స్లో ఉన్న భారత సంతతి ప్రజలతో కూడా భేటీ కానున్నారు. అనంతరం ఫ్రాన్స్ నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), బహ్రెయిన్ దేశాల్లో అయిదు రోజుల పాటు ఈ నెల 26 వరకు పర్యటించనున్నారు. శనివారం బహ్రెయిన్ వెళ్లనున్నారు. ఆ దేశానికి వెళుతున్న తొలి భారత ప్రధాని మోదీయే కావడం విశేషం. 25న తిరిగి ఫ్రాన్స్ వచ్చి జీ-7 సదస్సులో పాల్గొంటారు. 26న భారత్ తిరిగి వస్తారు.