ఇండియాలో క‌రోనా క‌ల్లోలం : 24 గంటల్లో 1007 మంది మృతి

|

Aug 10, 2020 | 1:57 PM

భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగానే ఉంది. మరణాల సంఖ్య ప్ర‌మాద‌క‌రంగా పెరుగుతోంది. గత కొద్దిరోజులుగా డైలీ రికార్డుస్థాయిలో 900లకుపైగా మరణాలు సంభవిస్తున్నాయి.

ఇండియాలో క‌రోనా క‌ల్లోలం : 24 గంటల్లో 1007 మంది మృతి
Follow us on

India Corona Latest Cases : భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగానే ఉంది. మరణాల సంఖ్య ప్ర‌మాద‌క‌రంగా పెరుగుతోంది. గత కొద్దిరోజులుగా డైలీ రికార్డుస్థాయిలో 900లకుపైగా మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా గ‌డిచిన 24 గంట‌ల్లో అత్యధికంగా 1007మంది కరోనా క‌రోనా కార‌ణంగా చ‌నిపోయారు. దీంతో సోమవారం నాటికి దేశంలో కరోనా మరణాల సంఖ్య 44,386కు చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. కాగా వ‌రల్డ్‌లో కరోనా మరణాలు అత్యధికంగా సంభవిస్తోన్న దేశాల లిస్ట్‌లో భారత్‌ ఐదో స్థానంలో ఉంది.

ఇక దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య విప‌రీతంగా పెరుగ‌తోంది. దేశంలో వరుసగా నాలుగోరోజు 60వేల పై చిలుకు కేసులు బయటపడ్డాయి. గడిచిన 24గంటల్లో దేశ‌వ్యాప్తంగా కొత్తగా 62,064  కోవిడ్ పాజిటివ్ కేసులు నిర్దార‌ణ అయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 22,15,074కు చేరింది. కాగా ఇప్ప‌టివ‌ర‌కు దేశవ్యాప్తంగా 15,35,744 మంది వ్యాధి బారి నుంచి కోలుకోగా… మరో 6,34,945 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం ఇండియాలో కరోనా బాధితుల రికవరీ రేటు 69శాతానికి చేరింది.

 

Also Read : తెలంగాణ క‌రోనా అప్‌డేట్స్..జిల్లాల వారీగా