IND Vs AUS: టీమిండియాతోనే రోహిత్.. టీ20 సిరీస్‌తో బరిలోకి..!

టీమిండియాతోనే రోహిత్ శర్మ ఆస్ట్రేలియా పయనం కానున్నట్లు సమాచారం. ఐపీఎల్ ఫైనల్ అనంతరం నవంబర్ 11న జట్టుతో పాటు రోహిత్‌ను పంపించి..

IND Vs AUS: టీమిండియాతోనే రోహిత్.. టీ20 సిరీస్‌తో బరిలోకి..!

Updated on: Nov 08, 2020 | 3:20 PM

IND Vs AUS: ఆస్ట్రేలియా పర్యటనకు ఓపెనర్ రోహిత్ శర్మకు సెలెక్టర్లు విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. తొడకండరాల గాయం కారణంగా హిట్‌మ్యాన్‌ ఐపీఎల్‌లో కొన్ని మ్యాచ్‌లకు దూరం అయ్యాడు. దీనితో అతడి గాయాన్ని ఫిజియోలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. రోహిత్ పూర్తి ఫిట్‌నెస్‌ సాధించిన తర్వాత తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని బీసీసీఐ స్పష్టం చేసింది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. టీమిండియాతోనే రోహిత్ శర్మ ఆస్ట్రేలియా పయనం కానున్నట్లు సమాచారం. ఐపీఎల్ ఫైనల్ అనంతరం నవంబర్ 11న జట్టుతో పాటు రోహిత్‌ను పంపించి.. ఫిజియో నితిన్ పటేల్ పర్యవేక్షణలో ఉంచుతారట. వన్డేలకు విశ్రాంతినిచ్చి.. టీ20 సిరీస్‌కు బరిలోకి దింపాలని బీసీసీఐ యోచిస్తోందని తెలుస్తోంది.

Also Read:

ఆంజనేయుడి జన్మస్థలం ఎక్కడ.? పరిశోధనకు ఆదేశించిన టీటీడీ.!

జగన్ సంచలన నిర్ణయం.. వారికి 10 రోజుల పాటు రోజుకో పధకం..

ఆ క్యాచ్ మిస్ కాకుంటే.. కథ వేరేలా ఉండేదిః కోహ్లీ

అక్కడ డిసెంబర్ 31 వరకు స్కూల్స్ మూసివేత..

మళ్లీ స్లెడ్జింగ్ చేసిన కోహ్లీ.. ఈసారి రిప్లై అదుర్స్.!

ఆ పాస్టర్లపై చర్యలు తీసుకోండి.. ఏపీ ప్రభుత్వానికి కేంద్రం ఆదేశం

బిగ్ బాస్ 4: హౌస్ నుంచి అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్..!

Loading...
Unable to load recommendations.
Follow Us