AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather Report: భారీ వర్షాలు.. 25 రాష్ట్రాలకు IMD హెచ్చరికలు జారీ!

దేశవ్యాప్తంగా రుతుపవనాలు మరోసారి చురుగ్గా మారాయి. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, ఉత్తరప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఐఎండీ సుమారు 25 రాష్ట్రాలకు ఆరెంజ్‌, ఎల్లో అలర్ట్‌లు జారీ చేసింది. ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌లో కొండచరియలు, రహదారులు మూసుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

Weather Report: భారీ వర్షాలు.. 25 రాష్ట్రాలకు IMD హెచ్చరికలు జారీ!
Weather Report
SN Pasha
|

Updated on: Aug 23, 2026 | 9:18 AM

Share

దేశంలోని పలు ప్రాంతాల్లో రుతుపవనాలు మరోసారి చురుగ్గా మారడంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మైదాన ప్రాంతాల నుంచి కొండ ప్రాంతాల వరకు వాతావరణ పరిస్థితుల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఆదివారం తెల్లవారుజామునే వర్షాలు ప్రారంభమయ్యాయి. బలమైన ఈదురుగాలులు, మేఘావృతమైన వాతావరణంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

భారత వాతావరణ శాఖ (ఐఎండీ) పలు రాష్ట్రాలకు భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌తో పాటు ఉత్తర, మధ్య భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఆరెంజ్‌, ఎల్లో అలర్ట్‌లు ప్రకటించింది. ఢిల్లీ, నోయిడా, ఘాజియాబాద్‌, గురుగ్రామ్‌, ఫరీదాబాద్‌ ప్రాంతాల్లో ఉదయం నుంచే నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి. వర్షాలు, బలమైన గాలులు కొనసాగితే ఉష్ణోగ్రతలు తగ్గి, కొంతకాలంగా ఉన్న ఉక్కపోత నుంచి ప్రజలకు ఉపశమనం లభించే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా సుమారు 25 రాష్ట్రాల్లో భారీ వర్షాలు, ఉరుములు, పిడుగులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీ, బిహార్‌, హర్యానా, రాజస్థాన్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, పంజాబ్‌, జమ్మూకశ్మీర్‌, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, పశ్చిమబెంగాల్‌, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, గుజరాత్‌, మహారాష్ట్రతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.

ఉత్తరప్రదేశ్‌, బిహార్‌ రాష్ట్రాల్లో వాతావరణ ప్రభావం మరింత ఎక్కువగా ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడం, బలహీన ప్రాంతాల్లో వరద పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక కొండ ప్రాంతాలైన ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటం, భూమి కుంగిపోవడం, రహదారులపై రాళ్లు పడటం వంటి ప్రమాదాలు పెరిగాయి. దీంతో జాతీయ రహదారులు, అనుసంధాన మార్గాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. పిడుగులు పడే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని అధికారులు సూచించారు. నదులు, వాగుల సమీపంలో నివసించే ప్రజలు అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని కోరారు. భారీ వర్షాలు కొనసాగే సమయంలో కొండ ప్రాంతాలకు అనవసర ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని పర్యాటకులకు సూచించారు.

Follow Us