AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భార్యపై అనుమానం… వివస్త్రను చేసి వీడియోలు..

అనుమానం పెనుభూతంగా మారింది. ప్రశాంతంగా సాగిపోతున్న వారి సంసారంలో అగ్గిరాజుకుంది. 15 ఏళ్ల కాపురంలో చిచ్చు పెట్టింది. కట్టుకున్న భార్యపై అనుమానంతో వికృత చేష్టాలకు పాల్పడ్డాడో భర్త.

భార్యపై అనుమానం... వివస్త్రను చేసి వీడియోలు..
Jyothi Gadda
|

Updated on: Feb 27, 2020 | 3:08 PM

Share

అనుమానం పెనుభూతంగా మారింది. ప్రశాంతంగా సాగిపోతున్న వారి సంసారంలో అగ్గిరాజుకుంది. 15 ఏళ్ల కాపురంలో చిచ్చు పెట్టింది. కట్టుకున్న భార్యపై అనుమానంతో వికృత చేష్టాలకు పాల్పడ్డాడో భర్త. ఆమెను శారీరకంగా వేధిస్తూ..రాక్షసానందం పొందాడు. భర్త చేతిలో తీవ్రంగా గాయపడిన మహిళను బంధువులు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందజేస్తున్నారు. వనపర్తి జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటన అందరని కలచివేచింది. వివరాల్లోకి వెళితే…

వనపర్తి జిల్లాలో దారుణ సంఘటన జరిగింది. కట్టుకున్న భార్యను నిత్యం చిత్రహింసలు పెట్టాడో ప్రబుద్ధుడు. వారికి పెళ్లై 15 ఏళ్లు పూర్తయ్యాయి. 14 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. ఇంతకాలం ఎంతో అన్యోంన్యంగా సాగిన వీరి కాపురంలో అనుమానం అనే చిచ్చు రాజుకుంది. ఏం జరిగిందో తెలియదు గానీ,.. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్నాడు భర్త. దీంతో ఆమెను తరచూ వేధింపులకు గురిచేసేవాడు. రోజుకో రకంగా చిత్రహింసలు పెట్టసాగాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య తలెత్తిన వివాదంతో ఆమెపై దాష్టీకం ప్రదర్శించాడు. ఇనుప రాడ్డుతో తల పగులగొట్టాడు. చేతికి దొరికిన వస్తువుతో చితకబాదాడు. ఒళ్లంతా రక్తం కారుతున్నా కనికరించలేదు.

అయినా.. ఆవేశం చల్లారలేదు. ఆమెను వివస్త్రను చేసి శరీరంపై ఇనుప చువ్వలతో వాతలు పెట్టాడు. ఆ దృశ్యాలను 14ఏళ్ల కొడుకుతో సెల్‌ఫోన్లో వీడియో తీయించాడు. విషయం బయటకు తెలియటంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భాదితురాలిని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి చికిత్స అందజేశారు. కిరాతక భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.