AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మోదీజీ… దక్షిణాదిపై చిన్న చూపా? ఇదే నిదర్శనం!

మహాత్మాగాంధీ 150 జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఢిల్లీలో పలువురు ప్రముఖులు, సెలబ్రెటీలను విందుకు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. మహాత్ముడి మార్గాలు, ఆశయాల గురించి వారితో అనేక విషయాలను ఈ సందర్భంగా ఆయన పంచుకున్నారు. అంతేకాక దేశ ప్రజలకు అవి చేరువయ్యేలా చూడాలని వివరించారు. ఇక బాలీవుడ్ సెలబ్రిటీలు కొందరు ప్రధాని మోదీతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. దక్షిణాది ఫ్యాన్స్ తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా రామ్ చరణ్ సతీమణి ట్విట్టర్ వేదికగా తన […]

మోదీజీ... దక్షిణాదిపై చిన్న చూపా? ఇదే నిదర్శనం!
Ravi Kiran
|

Updated on: Oct 21, 2019 | 6:14 PM

Share

మహాత్మాగాంధీ 150 జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఢిల్లీలో పలువురు ప్రముఖులు, సెలబ్రెటీలను విందుకు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. మహాత్ముడి మార్గాలు, ఆశయాల గురించి వారితో అనేక విషయాలను ఈ సందర్భంగా ఆయన పంచుకున్నారు. అంతేకాక దేశ ప్రజలకు అవి చేరువయ్యేలా చూడాలని వివరించారు. ఇక బాలీవుడ్ సెలబ్రిటీలు కొందరు ప్రధాని మోదీతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. దక్షిణాది ఫ్యాన్స్ తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా రామ్ చరణ్ సతీమణి ట్విట్టర్ వేదికగా తన అసహనాన్ని వ్యక్తం చేసింది. బాలీవుడ్ సెలబ్రిటీలతో పోలిస్తే.. దక్షిణాది ప్రముఖులను అంతగా పట్టించుకోని వైనం దాదాపు దుమారం రేపింది. హిందీ ఆర్టిస్టులను మాత్రమే హైలైట్ చేస్తూ.. సౌత్ దిగ్గజాలను నిర్లక్ష్యం చేశారని.. టాలీవుడ్ పరిశ్రమను చెందిన అనేక మంది ప్రముఖులను పూర్తిగా పట్టించుకోలేదని.. ఇది ఎంతో బాధాకరమని ఆమె ట్వీట్ చేసింది.

ఇలా ఆమె పోస్ట్ చేసిన వెంటనే.. నెటిజన్లు కూడా ప్రధాని మోదీ తీరును తీవ్రంగా విమర్శించారు. నెట్టింట్లో ఇదొక హాట్ టాపిక్‌గా మారితే.. చివరికి పీఎంఓ దీనిపై క్లారిటీ ఇచ్చింది. దక్షిణాది నుంచి పలువురు ప్రముఖులను ఈ మీటింగ్‌కు పిలవడం జరిగిందని.. రకుల్ ప్రీత్ సింగ్, సాలూరి వాసూరావు, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, దిల్ రాజు, ఈనాడు ఎండీ కిరణ్, ఈటీవి సీఈఓ బాపినీడు తదితరులు హాజరయ్యారని తెలిపింది.

అయితే వీరందరూ మోదీతో దిగిన ఫోటోలు బయటికి రాకపోవడంతో నెట్టింట్లో రచ్చ జరిగింది. ఇక తాజాగా బాలీవుడ్ హీరోయిన్ తీసిన ఓ ఫొటోలో వీళ్ళందరూ ఉండటం విశేషం. మరోవైపు బాహుబలి టీమ్ రాజమౌళి, రానా దగ్గుబాటి, ప్రభాస్‌లకు కూడా ఆహ్వానం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కానీ వారు లండన్‌లో ‘బాహుబలి’ ప్రీమియర్ షోకు వెళ్లడంతో ఈ మీటింగ్‌కు హాజరు కాలేదని తెలుస్తోంది.
సౌత్ నుంచి పలువురు ఈ కార్యక్రమానికి హాజరైనా.. మోదీ దక్షిణాది మీద చిన్న చూపు చూస్తున్నారన్న మాట వాస్తవమే. ఆయన ఏర్పాటు చేసిన ఫంక్షన్ ఏదైనా అందులో ముఖ్యంగా బాలీవుడ్ ప్రముఖులు ఉంటారు తప్ప.. దక్షిణాది నుంచి దిగ్గజాలెవరికి కూడా ప్లేస్ ఉండదు. మోదీ-షా ద్వయం ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ జెండాను ఎగరేయాలనే పనిలో పడ్డారు. ఇప్పటికైనా ఆయన దృష్టి సారించి.. దక్షిణాది సినీ దిగ్గజాలతో మీట్ ఏర్పాటు చేస్తే.. తెలుగువారి ఓట్లు కూడా పడడం ఖాయమే.

Follow Us