
తాడిపత్రిలో హై అలర్ట్ కొనసాగుతోంది. అన్ని సెంటర్లలోనూ పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎంఎల్ఏ పెద్దారెడ్డి ఇళ్ల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. తాడిపత్రిలోనికి రాకపోకల నియంత్రణ కొనసాగుతోంది. బయటి ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలకు తాడిపత్రి లోపలికి రానివ్వడం లేదు. ఇప్పటికే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఇరువర్గాల అనుచరులు, పార్టీల కార్యకర్తలను తాడిపత్రి నుంచి పోలీసులు పంపించేశారు. తాడిపత్రిలో జరిగిన దాడులపై ఈ రోజు కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన విషయం తెలిసిన వెంటనే జేసీ దివాకర్ రెడ్డి హైదరాబాద్ నుంచి తాడిపత్రి చేరుకున్నారు.
Also Read :
Variety marriage : వధువు పెళ్లి వద్దని వెళ్లిపోయింది…అతిథిలా వచ్చిన అమ్మాయి పెళ్లికూతురైంది
Drunk And Drive Tests : మందుబాబులకు హెచ్చరిక..నేటి నుంచి నగరంలో డ్రంక్ అండ్ టెస్టులు షురూ