AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాలకు వెదర్ అలర్ట్..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడన౦గా మారింది. ఇది - ప్రస్తుతం ఉత్తర కోస్తాంధ్ర, దానికి సమీపంలోని పశ్చిమ మధ్య బ౦గాళాఖాత౦లో కేంద్రీకృతమై ఉంది. దీనికి అనుబంధంగా మధ్యస్త ట్రోపోస్పియర్ వరకు ఉపరితల ఆవర్తన౦...

ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాలకు వెదర్ అలర్ట్..
Sanjay Kasula
|

Updated on: Sep 14, 2020 | 2:55 PM

Share

Heavy Rain Warning : ఆంధ్రప్రదేశ్‌లో మరిన్ని వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పాడిన అల్పడీన ప్రభావంతో ఏడు జిల్లాలపై అధిక ప్రభావం ఉంటుందని హెచ్చరించింది. వర్షంతోపాటు వేగంగా గాలుగు వీస్తాయని తెలిపింది. ఈ ప్రభావంతో రెండు రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడన౦గా మారింది. ఇది – ప్రస్తుతం ఉత్తర కోస్తాంధ్ర, దానికి సమీపంలోని పశ్చిమ మధ్య బ౦గాళాఖాత౦లో కేంద్రీకృతమై ఉంది. దీనికి అనుబంధంగా మధ్యస్త ట్రోపోస్పియర్ వరకు ఉపరితల ఆవర్తన౦ కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రెండు రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఇక – ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కరిసే అవకాశం ఉంది. కోస్తాంధ్ర తీరం వె౦బడి గ౦టకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే చాన్స్‌ ఉంది. అయితే ఇప్పటి కడప, కర్నూలు జిల్లాలో జోరు వానలు కుస్తున్నాయి. అటు తూర్పుగోదావరి జిల్లాలోనూ కుంభవృష్టి కొనసాగుతోంది.