AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలుగు రాష్ట్రాలపై ‘భానుడి’ ప్రభావం

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు కాస్త తగ్గుముఖం పడ్డాయి. కొన్ని ప్రదేశాల్లో మాత్రం భానుడి తీవ్రత కొనసాగుతోంది. అయితే నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి రావడంతో పలు చోట్ల వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా తాజాగా తెలంగాణాలో అత్యధికంగా 45, ఏపీలో 43  డిగ్రీలకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అదిలాబాద్- 45 డిగ్రీలు జగిత్యాల – 45 డిగ్రీలు ఖమ్మం – 43 డిగ్రీలు నిజామాబాద్ – 43 […]

తెలుగు రాష్ట్రాలపై ‘భానుడి’ ప్రభావం
Ravi Kiran
| Edited By: |

Updated on: Jun 06, 2019 | 7:49 AM

Share

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు కాస్త తగ్గుముఖం పడ్డాయి. కొన్ని ప్రదేశాల్లో మాత్రం భానుడి తీవ్రత కొనసాగుతోంది. అయితే నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి రావడంతో పలు చోట్ల వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా తాజాగా తెలంగాణాలో అత్యధికంగా 45, ఏపీలో 43  డిగ్రీలకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు

  • అదిలాబాద్- 45 డిగ్రీలు
  • జగిత్యాల – 45 డిగ్రీలు
  • ఖమ్మం – 43 డిగ్రీలు
  • నిజామాబాద్ – 43 డిగ్రీలు
  • రామగుండం – 47 డిగ్రీలు
  • నిర్మల్ – 44 డిగ్రీలు
  • మంచిర్యాల – 47 డిగ్రీలు
  • నల్గొండ – 44 డిగ్రీలు
  • సిరిసిల్ల – 45 డిగ్రీలు
  • వరంగల్ – 46 డిగ్రీలు
  • కొత్తగూడెం – 45 డిగ్రీలు
  • హుజురాబాద్ -43 డిగ్రీలు
  • జమ్మికుంట- 43 డిగ్రీలు
  • కరీంనగర్ – 45 డిగ్రీలు
  • భువనగురి – 46 డిగ్రీలు
  • కామారెడ్డి – 44 డిగ్రీలు 
  • హైద్రాబాద్ -41 డిగ్రీలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి…

  • కడప – 43 డిగ్రీలు
  • బద్వేలు -43 డిగ్రీలు
  • నందిగామ- 42 డిగ్రీలు
  • గుంటూరు – 47 డిగ్రీలు
  • విజయవాడ – 48 డిగ్రీలు 
  • తాడిపత్రి – 43 డిగ్రీలు 
  • గుడివాడ – 48 డిగ్రీలు 
  • కర్నూలు – 43 డిగ్రీలు
  • నంద్యాల- 44 డిగ్రీలు
  • అనంతపురం – 41 డిగ్రీలు
  • ఏలూరు- 44 డిగ్రీలు
  • నెల్లూరు- 45డిగ్రీలు 
  • కదిరి- 40 డిగ్రీలు
  • కాకినాడ – 45 డిగ్రీలు
  • రాజమండ్రి – 45 డిగ్రీలు
  • విశాఖపట్నం – 41 డిగ్రీలు

ఎండల ప్రభావం నేపథ్యంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మధ్యహ్నం సమయంలో అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు వెళ్లకూడదని చెబుతున్నారు. శీతల పానీయాల జోలికి వెళ్లకుండా మజ్జిగ, పండ్లరసాలను ఎక్కువగా తీసుకోవాలని..నీటిని తక్కువ మోతాదులో అరగంటకొకసారి తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.