జులై నెలలో పార్లమెంటు వర్షాకాలపు సమావేశాలు.. సాధారణ షెడ్యూల్​ ప్రకారమే కార్యక్రమాలు

పార్లమెంటు వర్షాకాలపు సమావేశాలు జులై నెలలో ప్రారంభమవుతాయని కేంద్రం ప్రకటించింది.  కరోనా రెండోదశ వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో పార్లమెంటు​ వర్షాకాలం సమావేశాలు సాధారణ షెడ్యూల్​...

జులై నెలలో పార్లమెంటు వర్షాకాలపు సమావేశాలు.. సాధారణ షెడ్యూల్​ ప్రకారమే కార్యక్రమాలు

Updated on: Jun 09, 2021 | 12:09 AM

పార్లమెంటు వర్షాకాలపు సమావేశాలు జులై నెలలో ప్రారంభమవుతాయని కేంద్రం ప్రకటించింది.  కరోనా రెండోదశ వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో పార్లమెంటు​ వర్షాకాలం సమావేశాలు సాధారణ షెడ్యూల్​ ప్రకారం జులైలో ప్రారంభమవుతాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి పార్లమెంటు సెషన్స్​ కుదించినట్లు  కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. గతేడాది పార్లమెంటు శీతాకాలపు సమావేశాలు రద్దు చేసినట్లు గుర్తు చేశారు.

గతేడాది సాధారణంగా జులైలో ప్రారంభం కావాల్సిన వర్షాకాలం సమావేశాలు సెప్టెంబర్‌లో ప్రారంభమయ్యాయి. అయితే ఈసారి యథావిధిగా జరుగుతాయన జోషి పేర్కొన్నారు. మరోవైపు ఈ సమావేశాల నిర్వహణకు సంబంధించిన విధివిధానాలపై చర్చలు జరుగుతున్నాయని అధికార వర్గాలు తెలిపాయి.

ఎంపీలకు స్పీకర్ లేఖకరోనా కాలంలో తమ నియోజకవర్గాల్లో చేపట్టిన సహాయక చర్యల వివరాలు తెలియచేయాలని ఎంపీలను కోరారు లోక్‌సభ స్పీకరు ఓం బిర్లా. ఈ మేరకు వారందరికీ లేఖ రాశారు. భవిష్యత్తులో ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవటానికి జాతీయ స్థాయిలో ఉత్తమ పద్ధతులను అభివృద్ధి చేయడానికి ఇది తోడ్పడుతుందని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి :  Samantha Family Man2: స‌మంత యాక్ష‌న్స్ సీన్స్ ఎలా చేసిందో చూశారా.? బ‌డా హీరోలు సైతం బ‌లాదూర్‌..