కంటతడి పెట్టిన మాజీ ప్రధాని

| Edited By:

Mar 13, 2019 | 9:22 PM

బెంగళూరు: మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ కంటతడి పెట్టారు. తన మనవడి అభ్యర్థిత్వాన్ని ప్రకటింస్తూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. బుధవారం ఆయన తన మనవడు ప్రజ్వల్ రేవణ్ణను హసన్ లోక్‌సభ అభ్యర్థిగా ప్రకటించారు. ఇదంతా పార్టీ కార్యకర్తల సమావేశంలో జరిగింది. పక్కనే ఉన్న ప్రజ్వల్.. దేవెగౌడను ఓదార్చారు. ఈ సందర్భంగా దేవెగౌడ మాట్లాడుతూ.. తాను రాజకీయాల్లోకి ఎంతో మందిని తీసుకొచ్చానని, చాలా సపోర్ట్ అందించానని అన్నారు. కానీ తమ కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి తీసుకొస్తామంటే మాత్రం తప్పు […]

కంటతడి పెట్టిన మాజీ ప్రధాని
Follow us on

బెంగళూరు: మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ కంటతడి పెట్టారు. తన మనవడి అభ్యర్థిత్వాన్ని ప్రకటింస్తూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. బుధవారం ఆయన తన మనవడు ప్రజ్వల్ రేవణ్ణను హసన్ లోక్‌సభ అభ్యర్థిగా ప్రకటించారు. ఇదంతా పార్టీ కార్యకర్తల సమావేశంలో జరిగింది.

పక్కనే ఉన్న ప్రజ్వల్.. దేవెగౌడను ఓదార్చారు. ఈ సందర్భంగా దేవెగౌడ మాట్లాడుతూ.. తాను రాజకీయాల్లోకి ఎంతో మందిని తీసుకొచ్చానని, చాలా సపోర్ట్ అందించానని అన్నారు. కానీ తమ కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి తీసుకొస్తామంటే మాత్రం తప్పు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో ప్రజ్వల్‌ని ఆశీర్వదించాలని ప్రజలను దేవగౌడ కోరారు.