ముంబై : మహారాష్ట్రలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాష్ట్రంలోని భీవండి ప్రాంతంలో ఉన్న జైమాతాది కాంపౌండ్లో అగ్నిప్రమాదం సంభవించింది. అకస్మాత్తుగా ఓ గోడౌన్లో మంటలు చెలరేగాయి. దీంతో సమీప ప్రాంతమంతా దట్టమైన పొగలతో కమ్మేసింది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనాస్థలికి చేరుకుని ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో పెద్ద ఎత్తున ఆస్తినష్టం వాటిల్లినట్లు గోడౌన్ యజమానులు తెలిపారు.