దుబాయ్‌లో కుమారుడి పెళ్లి.. 15 ప్రత్యేక విమానాలు..!

| Edited By: Srinu

Nov 23, 2019 | 2:53 PM

దుబాయ్‌లో రేపు బీజేపీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ కుమారుడి వివాహం అంగరంగ వైభంగా జరగబోతోంది. రాజమండ్రికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త.. ఆలూరి రాజా కుమార్తె పూజతో.. సీఎం రమేష్.. కుమారుడు రిత్విక్ పెళ్లి జరగనుంది. ఇందుకు ఘనంగా పలు ఏర్పాట్లు చేశారు సీఎం రమేష్. పెళ్లికి ప్రత్యేకంగా 15 విమానాలను బుక్ చేశారట. ఈ పెళ్లికి దాదాపు 75 మంది ఎంపీలు హాజరు కాబోతున్నారట. ఆలూరి రాజా ఫ్యామిలీలో అందరూ డాక్టర్లే. అమెరికాలో  ఈ ఫ్యామిలీ […]

దుబాయ్‌లో కుమారుడి పెళ్లి.. 15 ప్రత్యేక విమానాలు..!
Follow us on

దుబాయ్‌లో రేపు బీజేపీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ కుమారుడి వివాహం అంగరంగ వైభంగా జరగబోతోంది. రాజమండ్రికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త.. ఆలూరి రాజా కుమార్తె పూజతో.. సీఎం రమేష్.. కుమారుడు రిత్విక్ పెళ్లి జరగనుంది. ఇందుకు ఘనంగా పలు ఏర్పాట్లు చేశారు సీఎం రమేష్. పెళ్లికి ప్రత్యేకంగా 15 విమానాలను బుక్ చేశారట. ఈ పెళ్లికి దాదాపు 75 మంది ఎంపీలు హాజరు కాబోతున్నారట. ఆలూరి రాజా ఫ్యామిలీలో అందరూ డాక్టర్లే. అమెరికాలో  ఈ ఫ్యామిలీ సెటిల్అ యింది. అంతేకాకుండా.. గతంలో.. సీఎం రమేష్ ఉక్కు దీక్ష చేసిన సందర్భంగా కడపలో వైద్య పరీక్షలు నిర్వహించింది కూడా ఈ రాజా దంపతులే.

రస్ ఆల్ ఖైమా అనే దేశంలో.. వాల్ డార్ఫ్ ఆస్టోరియాలో.. రిత్విక్, పూజాల వివాహం జరగనుంది. కాగా.. ఇప్పటికే.. అక్కడికి పలువురు వీఐపీలు చేరుకున్నారట.