ప్రముఖ డిజైనర్​ అనుమానాస్పద రీతిలో మృతి

|

Sep 18, 2020 | 11:02 AM

ప్రముఖ ఫ్యాషన్​ డిజైనర్​ షర్బరి దత్తా గతరాత్రి కోల్​కతాలోని ఆమె నివాసంలో అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. బాత్ రూమ్ లో ఆమె విగతజీవిగా పడి ఉండటం చూసిన ఫ్యామిలీ మెంబర్స్ పోలీసులకు సమాచారం అందించారు.

ప్రముఖ డిజైనర్​ అనుమానాస్పద రీతిలో మృతి
Follow us on

ప్రముఖ ఫ్యాషన్​ డిజైనర్​ షర్బరి దత్తా గతరాత్రి కోల్​కతాలోని ఆమె నివాసంలో అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. బాత్ రూమ్ లో ఆమె విగతజీవిగా పడి ఉండటం చూసిన ఫ్యామిలీ మెంబర్స్ పోలీసులకు సమాచారం అందించారు. గుండెపోటు కారణంగా చనిపోయి ఉండొచ్చని పోలీసులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. షర్బరి దత్తా శుక్రవారం ఉదయం 12.15 గంటలకు తుదిశ్వాస విడిచారు. సమాచారం అందిన వెంటనే కోల్​కతా పోలీస్​ హెడ్​క్వార్టర్స్​కు చెందిన లాల్​బజార్​ బ్రాంచ్ సిబ్బంది​ ఘటనాస్థలికి చేరుకున్నారు. చివరిగా ఆమె మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత రోజు నుంచి ఆమె గదిలో ఒంటరిగా ఉన్నట్లు తెలుస్తోంది.

షర్బరి దత్తా​ ఆకస్మిక మరణంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దత్తా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.  ప్రముఖ బెంగాలీ కవి అజిత్​ దత్తా కుమార్తే షర్బరి దత్తా.. కొన్ని దశాబ్దాలుగా కాస్ట్యూమ్​ డిజైనింగ్​ రంగంలో స్థిరపడ్డారు.

Also Read :

కన్నతండ్రే సుపారీ ఇచ్చి కొడుకును చంపించాడు !

దేశంలో కరోనా కల్లోలం, 24 గంటల్లో 1174 మరణాలు