కాంగ్రెస్ పార్టీకి షాక్ల మీద షాకులు కొడుతున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో కోలుకోవడం కూడా కష్టమే అన్నట్టు తగులుతోంది. తాజాగా.. పార్టీ మొత్తానికి భారీ షాక్ కొట్టింది. పార్టీలో సీనియర్ లీడర్, మాజీ మంత్రి డీకే అరుణ బీజేపీలోకి చేరారు. ఇప్పటివరకు ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కారెక్కుతుండడంతో కలవరం చెందుతున్న హైకమాండ్ ఈ షాక్తో మరింత షాక్కు గురవుతోంది.
మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన అరుణ.. ఒక్క జిల్లాకే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా తన ప్రభావాన్ని చూపిస్తుంది. హైకమాండ్ ఈ మధ్య ప్రకటించిన ఎంపీ అభ్యర్థుల్లో తనకు జరిగిన తీవ్ర అన్యాయంపై అసహనంతో, అసంతృప్తితో ఉన్న కారణంగానే ఆమె బీజేపీలోకి మారినట్టు సమాచారం. మంగళవారం రాత్రి ఆమె అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు.