AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి సంక్షేమ పథకాల వర్తింపు: పుష్ప శ్రీవాణి

ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ పథకాల ద్వారా అర్హతగల ప్రతి వ్యక్తి, వారి కుటుంబ సభ్యులు ప్రయోజనం పొందుతారని డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పుష్ప శ్రీవాణి తెలిపారు. ప్రజలు సిఫారసు కోసం ఏ నాయకుడిని సంప్రదించనవసరం లేదని ఆమె అన్నారు. ప్రభుత్వం స్పష్టమైన విధానాలతో పనిచేస్తుందని, కార్యక్రమాలను అమలు చేయడానికి సరియైన పద్ధతులను అనుసరిస్తోందని మంత్రి చెప్పారు. శుక్రవారం, ఆమె విజయనగరం జిల్లాలోని జియ్యమ్మవలస మండలంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొని, వరి కొనుగోలు […]

అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి సంక్షేమ పథకాల వర్తింపు: పుష్ప శ్రీవాణి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 21, 2019 | 2:50 PM

Share

ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ పథకాల ద్వారా అర్హతగల ప్రతి వ్యక్తి, వారి కుటుంబ సభ్యులు ప్రయోజనం పొందుతారని డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పుష్ప శ్రీవాణి తెలిపారు. ప్రజలు సిఫారసు కోసం ఏ నాయకుడిని సంప్రదించనవసరం లేదని ఆమె అన్నారు. ప్రభుత్వం స్పష్టమైన విధానాలతో పనిచేస్తుందని, కార్యక్రమాలను అమలు చేయడానికి సరియైన పద్ధతులను అనుసరిస్తోందని మంత్రి చెప్పారు. శుక్రవారం, ఆమె విజయనగరం జిల్లాలోని జియ్యమ్మవలస మండలంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొని, వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి పథకాల అమలుపై స్పష్టమైన అభిప్రాయాలు, ప్రణాళికలు ఉన్నాయని ఆమె వివరించారు. గత టీడీపీ హయాంలోని లోపాలు, అవకతవకలను రాష్ట్ర ప్రభుత్వం సరిదిద్దుతోందని మంత్రి చెప్పారు. “ఇంతకుముందు ప్రతి ప్రభుత్వ పథకం నుండి ప్రయోజనాలను టీడీపీ పార్టీ కార్యకర్తలు, వారి సానుభూతిపరులు మాత్రమే ఉపయోగించారు. సాధారణ ప్రజలు విస్మరించబడ్డారు” అని ఆమె తెలిపారు. టీడీపీ పాలనలో జన్మభూమి కమిటీలు సమాజాన్ని దోచుకున్నాయని ఆమె ఆరోపించారు. జగన్ ప్రభుత్వం పారదర్శకతను సమర్థిస్తుందని, సాధారణ ప్రజల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి స్పష్టం చేశారు.