Breaking: బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపు..

| Edited By: Rajesh Sharma

Nov 10, 2020 | 4:09 PM

దుబ్బాకలో కమలం పార్టీ దుమ్ము రేపింది. దివంగత నేతల సెంటిమెంటును, అధికార పార్టీ బలాబలాలను తోసి పెట్టి మరీ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించింది. నరాలు తెగేలా ఉత్కంఠ రేపిన ఓట్ల లెక్కింపులో విజయం చివరికి బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావునే వరించింది.

Breaking: బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపు..
Follow us on

Dubbaka Dangal: దుబ్బాక ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు సంచలన విజయాన్ని సాధించారు. ఈ ఎన్నికల్లో మొత్తంగా 1,118 ఓట్లతో బీజేపీ గెలుపొందింది. కౌంటింగ్ హోరాహోరీగా సాగింది. చివరి వరకు ఇరు పార్టీల మధ్య ఫలితం దోబూచులాడింది. తొలి ఐదు రౌండ్లలో బీజేపీ ఆధిక్యత కనబరిచినప్పటికీ.. ఆరో రౌండ్ తర్వాత నుంచి ప్రతీ రౌండ్‌కు ఫలితం ఉత్కంఠ రేపింది. ఒకట్రెండు రౌండ్లలో టీఆర్ఎస్ ఆధిక్యతను ప్రదర్శించినా.. ఆ తర్వాత బీజేపీ పుంజుకుంది. ముఖ్యంగా 14వ రౌండ్ నుంచి 19 రౌండ్ వరకు టీఆర్ఎస్ వరుసగా ఆధిక్యతను కనబరిచింది. ఇక ఆ తర్వాత 20వ రౌండ్ నుంచి 23వ రౌండ్ వరకు బీజేపీ మళ్లీ పుంజుకుని విజయాన్ని సాధించింది. చివరికి పోస్టల్ ఓట్లను కూడా కలుపుకుంటే బీజేపీ అభ్యర్థి 1,118 ఓట్ల ఆధిక్యంతో దుబ్బాక ఉప ఎన్నికలో సంచలన విజయం సాధించారు.

23వ రౌండ్‌లో..

బీజేపీ – 1653

టీఆర్ఎస్ – 1241

కాంగ్రెస్ -580

ఈ రౌండ్‌ ముగిసేసరికి బీజేపీకి వచ్చిన లీడ్ – 1470

మొత్తం వచ్చిన ఓట్లు..

బీజేపీ – 62,772

టీఆర్ఎస్ – 61,302

కాంగ్రెస్ – 21,819

పోస్టల్ బ్యాలెట్ వివరాలు:

టీఆర్ఎస్ – 720

బీజేపీ – 368

కాంగ్రెస్ – 142

టీఆర్ఎస్ మెజారిటీ: 352

ఫైనల్ ఓట్లు :

బీజేపీ – 63,140

టీఆర్ఎస్ – 62, 022

బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు సాధించిన మెజారిటీ: 1,118