ఆకాశ్ క్షిపణితో.. మళ్లీ అందనంత ఎత్తుకు
భారత అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది. భారత రక్షణ పరిశోధనా, అభివృద్ధి సంస్థ ఆకాశ్ -1ఎస్ క్షిపణిని సోమవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని బాలాసోర్ తీరం నుంచి దీనిని ప్రయోగించింది. భూ ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యం గల ఈ క్షిపణిని.. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో డీఆర్డీవో రూపొందించింది. భూ ఉపరితలం నుంచి 18 నుంచి 30 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న శత్రు దేశాల యుద్ధ విమానాలు, క్రూయీజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులు, […]
భారత అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది. భారత రక్షణ పరిశోధనా, అభివృద్ధి సంస్థ ఆకాశ్ -1ఎస్ క్షిపణిని సోమవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని బాలాసోర్ తీరం నుంచి దీనిని ప్రయోగించింది. భూ ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యం గల ఈ క్షిపణిని.. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో డీఆర్డీవో రూపొందించింది. భూ ఉపరితలం నుంచి 18 నుంచి 30 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న శత్రు దేశాల యుద్ధ విమానాలు, క్రూయీజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లను ఆకాశ్- 1ఎస్ సమర్థంగా కూల్చేయగలదు.
కాగా, రెండు రోజుల వ్యవధిలో ఈ క్షిపణిని రెండు సార్లు విజయవంతంగా ప్రయోగించినట్లు డీఆర్డీవో వెల్లడించింది. ఆకాశ్-1ఎస్ క్షిపణిని మే 25, 27న పరీక్షించినట్లు తెలిపింది.
#WATCH DRDO yesterday successfully test fired the Akash-1S surface to air defence missile system in Balasore off the Odisha coast. It is a new version of the missile fitted with an indigenous seeker. It was the second successful test of the missile. pic.twitter.com/XuaHTTC46F
— ANI (@ANI) May 28, 2019