ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా డాక్టర్‌ లక్ష్మణ్‌ బాధ్యతలు

|

Oct 19, 2020 | 3:32 PM

బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా డాక్టర్‌ లక్ష్మణ్‌ బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి , తెలుగు రాష్ట్రాలకు చెందిన బీజేపీ ఎంపీలు .. కీలక నేతలు హాజరయ్యారు.

ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా డాక్టర్‌ లక్ష్మణ్‌ బాధ్యతలు
Follow us on

Dr. Laxman  : బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా డాక్టర్‌ లక్ష్మణ్‌ బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి , తెలుగు రాష్ట్రాలకు చెందిన బీజేపీ ఎంపీలు .. కీలక నేతలు హాజరయ్యారు.

డాక్టర్‌ లక్ష్మణ్‌ లాంటి నేతల నాయకత్వంలో దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ మరింత బలపడుతుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు . కర్నాటకలో ఓబీసీల మద్దతు తోనే బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఓబీసీలకు మరింత పెద్దపీట వేస్తామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు .

ప్రధాని మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఓసీసీలకు న్యాయం జరుగుతోందని డాక్టర్.లక్ష్మణ్ తెలిపారు ‌. విద్యా , ఉపాధి అవకాశాల్లో రానున్న రోజుల్లో ఓబీసీలకు మరిన్ని అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఏపీ , తెలంగాణలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు లక్ష్మణ్‌.