ఇకపై ల్యాండ్‌లైన్‌ నుంచి మొబైల్‌ ఫోన్‌కు కాల్ చేయాలంటే ‘0’ తప్పనిసరిగా చేర్చాల్సిందే.!

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ అఫ్ ఇండియా(ట్రాయ్) చేసిన కొత్త ప్రతిపాదనకు టెలి కమ్యూనికేషన్స్ విభాగం(డాట్) ఆమోదముద్ర వేసింది. ఇక నుంచి..

ఇకపై ల్యాండ్‌లైన్‌ నుంచి మొబైల్‌ ఫోన్‌కు కాల్ చేయాలంటే 0 తప్పనిసరిగా చేర్చాల్సిందే.!

Updated on: Nov 25, 2020 | 2:56 PM

DoT Accepts Proposal: టెలికాం రెగ్యులేటరీ అథారిటీ అఫ్ ఇండియా(ట్రాయ్) చేసిన కొత్త ప్రతిపాదనకు టెలి కమ్యూనికేషన్స్ విభాగం(డాట్) ఆమోదముద్ర వేసింది. ఇక నుంచి దేశంలో ల్యాండ్‌లైన్ నుంచి మొబైల్ ఫోన్‌కు కాల్ చేసినప్పుడల్లా ప్రతీసారి తప్పనిసరిగా ‘0’ చేర్చాలని తెలిపింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ కొత్త నిబంధన అమలులోకి వస్తుందని.. దానికి అనుగుణంగా టెలికాం సంస్థలు ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని డాట్ సూచించింది.

అంతేకాకుండా ‘0’ చేర్చే విధంగా ల్యాండ్‌లైన్ డయిలింగ్ ప్యాటరన్‌లో మార్పులు చేయాలంది. ఈ కొత్త రూల్ గురించి చందాదారులకు ప్రకటనల ద్వారా తెలియజేయాలంది. అలాగే ల్యాండ్‌లైన్ నుంచి ఎవరైతే చందాదారులు సున్నాను చేర్చకుండా నెంబర్‌ను డయిల్ చేస్తారో.. వారికి ప్రతీసారి ఈ ప్రకటన వినిపించాలని డాట్ పేర్కొంది. చందాదారులందరికీ కూడా సున్నా డయిలింగ్ సౌకర్యాన్ని కల్పించాలని టెలికాం సంస్థలను డాట్ జారీ చేసిన సర్క్యులర్‌లో తెలిపింది.

ఇది చదవండి: వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఇక ఫోన్‌లో సిమ్ లేకుండానే మాట్లాడొచ్చు.!

Loading...
Unable to load recommendations.
Follow Us