తేనెటీగల దాడిలో డీఈ దుర్మరణం

|

Sep 22, 2020 | 5:13 PM

కర్నూలు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తేనెటీగల దాడిలో విధుల్లో ఉన్న అధికారి దుర్మరణం పాలయ్యాడు.

తేనెటీగల దాడిలో డీఈ దుర్మరణం
Follow us on

కర్నూలు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తేనెటీగల దాడిలో విధుల్లో ఉన్న అధికారి దుర్మరణం పాలయ్యాడు. బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ వద్ద ఈ విషాదఘటన జరిగింది. హెడ్ రెగ్యులేటర్ వద్ద విధుల్లో ఉన్న డివిజినల్ ఇంజనీర్ భానుప్రకాష్ పై తేనెటీగల దాడి చేశాయి. తేనెటీగల దాడిలో ఆయన ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు.హెడ్ రెగ్యులేటర్ వద్ద ఎస్‌ఆర్‌బీసీ గేట్ల తనిఖీ సమయంలో తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. దీంతో తీవ్రంగా గాయపడ్డ అతన్ని చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో మృతుని కుటుంబీకులు కన్నీరుమున్నీగా రోదిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.