మార్స్‌పై సముద్రాలు విపత్తులో కొట్టుకుపోయాయా..!

| Edited By: Team Veegam

Feb 14, 2020 | 1:46 PM

మార్స్ గ్రహంపై ఒకప్పుడు జీవం ఉండేదన్న వాదనలకు మరో ఆధారం లభించింది. మార్స్ గ్రహం నుంచి ఇటీవల వచ్చిన ఫొటోలు ఈ వాదనలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. అంతేకాదు అంగారక గ్రహంపై 22 సంవత్సరాల క్రితం నాసా ప్రవేశపెట్టిన ఫాత్‌ఫైండర్ మిషన్ కనుమరుగైన ఓ సముద్రపు అంచుల్లో ల్యాండ్ అయిందని వారు అంటున్నారు. అయితే 50సంవత్సరాల క్రితం మారినర్ 9 అనే స్పేస్‌క్రాఫ్ట్ కొన్ని ఫొటోలను భూమికి చేరవేసింది. అందులో 3.3మిలియన్ సంవత్సరాల క్రితం నుంచి సముద్రాలు ఉన్నట్లు […]

మార్స్‌పై సముద్రాలు విపత్తులో కొట్టుకుపోయాయా..!
Follow us on

మార్స్ గ్రహంపై ఒకప్పుడు జీవం ఉండేదన్న వాదనలకు మరో ఆధారం లభించింది. మార్స్ గ్రహం నుంచి ఇటీవల వచ్చిన ఫొటోలు ఈ వాదనలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. అంతేకాదు అంగారక గ్రహంపై 22 సంవత్సరాల క్రితం నాసా ప్రవేశపెట్టిన ఫాత్‌ఫైండర్ మిషన్ కనుమరుగైన ఓ సముద్రపు అంచుల్లో ల్యాండ్ అయిందని వారు అంటున్నారు.

అయితే 50సంవత్సరాల క్రితం మారినర్ 9 అనే స్పేస్‌క్రాఫ్ట్ కొన్ని ఫొటోలను భూమికి చేరవేసింది. అందులో 3.3మిలియన్ సంవత్సరాల క్రితం నుంచి సముద్రాలు ఉన్నట్లు ఆధారాలను సేకరించింది. వీటిని అధ్యనం చేసేందుకు 1997లో నాసా ఫాత్‌ఫైండర్ స్పేస్ క్రాఫ్ట్‌ను అంగారక గ్రహం మీదకు పంపింది. అయితే అప్పటికే అక్కడ వచ్చిన విపత్తుల వలన ఆ సముద్రాలు కొట్టుకుపోయాయని సీనియర్ శాస్త్రవేత్త అలెక్సియా రోడ్రిగ్వజ్ చెప్పారు . భూమి మీద వచ్చే వరదల కంటే అవి చాలా రెట్లు ఎక్కువ ప్రభావాన్ని చూపాయని వారు అంటున్నారు. దీంతో1997లో ఫాత్‌ఫైండర్ మిషన్ నుంచి వచ్చిన ఫొటోలపై వారు తిరిగి పరిశోధనలు ప్రారంభించారు. అలాగే మార్స్ గ్రహంపై ఒకప్పుడు మనగడ ఉందన్న వాదనలపై కూడా వారు పరిశోధనలు చేయనున్నారు.