AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వైభవంగా తిరుమల శ్రీవారి తెప్పోత్సవాలు

తిరుమల‌ శ్రీవారికి ఏటా ఫాల్గుణ మాసంలో పౌర్ణమికి ముందు తెప్పోత్సవాలు నిర్వహించే ఆనవాయితీ కొనసాగుతోంది. వీటిని ఫాల్గుణ శుక్ల ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు ఐదు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు శనివారం సాయంత్రం వైభవంగా ప్రారంభం కాగా, తొలి రోజు సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తిగా స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో భాగంగా తెప్పపై మూడు చుట్లు తిరిగి భక్తులను శ్రీవారు అనుగ్రహించారు. రెండో రోజు ఆదివారం రుక్మిణీ సమేత […]

వైభవంగా తిరుమల శ్రీవారి తెప్పోత్సవాలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 19, 2019 | 4:50 PM

Share

తిరుమల‌ శ్రీవారికి ఏటా ఫాల్గుణ మాసంలో పౌర్ణమికి ముందు తెప్పోత్సవాలు నిర్వహించే ఆనవాయితీ కొనసాగుతోంది. వీటిని ఫాల్గుణ శుక్ల ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు ఐదు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు శనివారం సాయంత్రం వైభవంగా ప్రారంభం కాగా, తొలి రోజు సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తిగా స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో భాగంగా తెప్పపై మూడు చుట్లు తిరిగి భక్తులను శ్రీవారు అనుగ్రహించారు. రెండో రోజు ఆదివారం రుక్మిణీ సమేత శ్రీకృష్ణుడిగా తెప్పలపై భక్తులకు అభయమిచ్చారు.

తిరుమల శ్రీవారి తెప్పోత్సవాల సందర్భంగా మూడో రోజు సోమవారం సాయంత్రం మలయప్పస్వామి శ్రీదేవి, భూదేవి సమేతంగా కోనేటిలో విహరించారు. ముందుగా సర్వాలంకార భూషితుడైన మలయప్ప దేవేరులతో కలసి నాలుగు మాడ‌వీధులలో ప్రదక్షిణగా పుష్కరిణిలోని తెప్పలోకి వేంచేశారు. అనంతరం మంగళవాయిద్యాలు, వేదపారాయణ, అన్నమయ్య కీర్తనాలాపనల నడుమ పుష్కరిణిలో తెప్పోత్సవం మూడుసార్లు కనులపండువగా సాగింది. వేలాది మంది భక్తులు ఉత్సవాన్ని తిలకించి స్వామికి నీరాజనాలు పట్టారు. నాలుగో రోజు మంగళవారం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్పస్వామి తెప్పపై ఐదు ప్రదక్షిణలు చేయనున్నారు.