ధోనీకి అరుదైన గౌరవం…!

|

Aug 18, 2020 | 8:17 PM

అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన మాజీ టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని సత్కరించేందుకు వాఖడే స్టేడియం ప్లాన్ చేస్తోంది.

ధోనీకి అరుదైన గౌరవం...!
Follow us on

అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన మాజీ టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని సత్కరించేందుకు వాఖడే స్టేడియం ప్లాన్ చేస్తోంది. స్టేడియంలోని ఓ సీటును ధోనీ పేరుతో రిజర్వ్ చేస్తోంది. 2011 ప్రపంచకప్ లో ధోనీ తన హెలికాప్టర్ సిక్స్ తో భారత్ కు విజయాన్నందించిన విషయం తెలిసిందే.

ధోనీ ఆ రోజు కొట్టిన సిక్స్ స్టాండ్స్ లో ఎక్కడైతే ల్యాండ్ అయిందో అక్కడ ఉన్న సీట్‌కు ధోనీ పెరు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ముంబై క్రికెట్ అసోసియేషన్ అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు ఆజింక్య నాయక్ ప్రతిపాదించారు. ఆ సీట్ కు కొత్తగా పెయింట్ వేసి చక్కగా అలంకరిస్తామని చెప్పారు. వాంఖడే స్టేడియంతో ధోనీకి గల అనుబంధాన్ని తెలిపేలా ఇది ఉంటుందని  ఆజింక్య నాయక్ తెలిపారు. ఈ నేపథ్యంలో వాంఖడేలో ధోనీ పేరున ఓ సీట్ ఏర్పాటు చేయడం అతడికి ఓ గొప్ప బహుమతిగా చెప్పవచ్చు.