రోడ్డు ప్రమాదం… బస్సు బోల్తా… 20 మంది పరిస్థితి విషమం… మరో 20 మందికి గాయాలు…

| Edited By:

Dec 14, 2020 | 7:13 AM

ఒడిశా నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఓ ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైంది. ఒడిశాలోని కలహండి జిల్లా ధారమ్‌గఢ్ నుంచి హైదరాబాద్‌ వస్తున్న ప్రైవేటు బస్సు బోల్తా పడింది.

రోడ్డు ప్రమాదం... బస్సు బోల్తా... 20 మంది పరిస్థితి విషమం... మరో 20 మందికి గాయాలు...
Follow us on

ఒడిశా నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఓ ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైంది. ఒడిశాలోని కలహండి జిల్లా ధారమ్‌గఢ్ నుంచి హైదరాబాద్‌ వస్తున్న ప్రైవేటు బస్సు బోల్తా పడింది. కలహండి జిల్లాలోని కోక్‌సర పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బొడోకెందుగుడ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటన జరిగే సమయంలో బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులు ఉన్నారు. అందులో 40 మందికి గాయాలవగా.. వారిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో సహాయ కార్యక్రమాలు అందించారు. క్షతగాత్రులను సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

భారీ మలుపు కారణంగానే…

భారీ మలుపును డ్రైవర్‌ గుర్తించలేకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కాగా, ఒడిశాలోని ధారమ్‌గఢ్ నుంచి హైదరాబాద్ 700 కిలో మీటర్లకు పైగా ఉంటుంది. ధారమ్‌గఢ్ నుంచి బస్సు బయలు దేరిన కాసేపటికే దాదాపు 40 కిలో మీటర్ల దూరంలో ఉన్న కోక్‌సర వద్ద ఈ ప్రమాదం జరిగింది.