AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అక్కడ రోబోలకు డిగ్రీ పట్టాలు అందించిన యూనివర్సిటీ..!

కరోనా దెబ్బకి కాలేజీలు మూతపడ్డాయి. కానీ అక్కడ చదివిన విద్యార్థులకు పట్టాలు అందించారు యూనివర్సిటీ అధికారులు. విద్యార్థుల తరపున డిగ్రీ పట్టాలు అందుకున్నది మాత్రం రోబోలు. ఫిలిప్పిన్స్ లోని మనీలాలో ఓ విద్యాలయం తమ విద్యార్థులకు వినూత్న రీతిలో డిగ్రీ పట్టాలను అందించింది. కేయాంటో విద్యాలయం యూనివర్సిటీ స్నాతకోత్సవం నిర్వహించాలని భావించింది. కరోనా లాక్ డౌన్ తో విద్యార్థులు ఫంక్షన్ కి రాలేమని తేల్చారు. దీంతో యూనివర్సిటీ అధికారులు.. స్నాతకోత్సవానికి హాజరు కాలేని విద్యార్థులకు బదులు రోబోలకు […]

అక్కడ రోబోలకు డిగ్రీ పట్టాలు అందించిన యూనివర్సిటీ..!
Balaraju Goud
| Edited By: |

Updated on: May 23, 2020 | 7:51 PM

Share

కరోనా దెబ్బకి కాలేజీలు మూతపడ్డాయి. కానీ అక్కడ చదివిన విద్యార్థులకు పట్టాలు అందించారు యూనివర్సిటీ అధికారులు. విద్యార్థుల తరపున డిగ్రీ పట్టాలు అందుకున్నది మాత్రం రోబోలు. ఫిలిప్పిన్స్ లోని మనీలాలో ఓ విద్యాలయం తమ విద్యార్థులకు వినూత్న రీతిలో డిగ్రీ పట్టాలను అందించింది. కేయాంటో విద్యాలయం యూనివర్సిటీ స్నాతకోత్సవం నిర్వహించాలని భావించింది. కరోనా లాక్ డౌన్ తో విద్యార్థులు ఫంక్షన్ కి రాలేమని తేల్చారు. దీంతో యూనివర్సిటీ అధికారులు.. స్నాతకోత్సవానికి హాజరు కాలేని విద్యార్థులకు బదులు రోబోలకు పట్టాలు అందించారు. ఇందుకోసం కేయాంటో విద్యాలయం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఒక్కో రోబో ఒక్కో విద్యార్థికి ప్రాతినిథ్యం వహించేలా ఏర్పాట్లు చేసింది. విద్యార్థులు తమకు ప్రాతినథ్యం వహిస్తున్న రోబోలను.. ఇంటి నుంచే రిమోట్ ద్వారా ఆపరేట్ చేస్తూ పట్టాలు అందుకున్నారు. ఇలా దాదాపు 176 మంది విద్యార్థులు రోబోల ద్వారా పట్టభద్రులయ్యారు. వీరంతా సైబర్ విద్యలో డిగ్రీలో ఉత్తీర్ణత సాధించారు.