ముంబై ఇండియన్స్ ఆటగాడు క్రునాల్ పాండ్యాను అడ్డుకున్న ఎయిర్ పోర్టు అధికారులు

|

Nov 12, 2020 | 9:35 PM

టీమిండియా ఆల్‌రౌండర్ క్రునాల్ పాండ్యాకు చేదు అనుభవం ఎదురైంది. ఐపీఎల్-13 సీజన్ ​ పూర్తిచేసుకుని స్వదేశానికి చేరిన ముంబై ఇండియన్స్​ ఆల్​రౌండర్​ క్రునాల్​ పాండ్యాను ముంబై ...

ముంబై ఇండియన్స్ ఆటగాడు క్రునాల్ పాండ్యాను అడ్డుకున్న ఎయిర్ పోర్టు అధికారులు
Follow us on

Krunal Pandya Stopped : టీమిండియా ఆల్‌రౌండర్ క్రునాల్ పాండ్యాకు చేదు అనుభవం ఎదురైంది. ఐపీఎల్-13 సీజన్ ​ పూర్తిచేసుకుని స్వదేశానికి చేరిన ముంబై ఇండియన్స్​ ఆల్​రౌండర్​ క్రునాల్​ పాండ్యాను ముంబై  విమానాశ్రయంలో అధికారులు అడ్డుకున్నారు.

క్రునాల్ పాండ్యాను కాసేపు విచారించారు ఎయిర్ పోర్ట్ అధికారులు. పాండ్యా వద్ద బంగారంతో పాటు ఇతర విలువైన వస్తువులను ఉన్నాయనే అనుమానంతో డైరెక్టరేట్​ ఆఫ్​ రెవెన్యూ ఇంటెలిజెన్స్​  అధికారులు నిలివేశారు. దీనిపై అధికారులు సదరు క్రికెటర్​ను కాసేపు ప్రశ్నించారు.

కొన్ని నివేదికల ప్రకారం.. క్రునాల్​ పాండ్యా వద్ద అనుమతించిన బంగారం కంటే ఎక్కువ ఉండటం వల్ల డీఆర్​ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం క్రునాల్​పై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. బంగారానికి సంబంధించిన అధికారిక పత్రాలను చూపించాల్సిందిగా డీఆర్​ఐ అధికారులు విజ్ఞప్తి చేశారు.