కరోనా ఎఫెక్ట్.. మినీ ఐపీఎల్‌కు ప్లాన్ రెడీ.!

|

Mar 15, 2020 | 3:33 PM

Coronavirus Scare: కరోనా వైరస్ కారణంగా మార్చి 29 నుంచి జరగాల్సిన ఐపీఎల్ టోర్నమెంట్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. కోవిడ్ 19 వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కేంద్రం ఏప్రిల్ 15 వరకు విదేశీయుల వీసాలను రద్దు చేసింది. దీనితో విదేశీ ఆటగాళ్లు అప్పటివరకు సీజన్‌కు అందుబాటులో ఉండరు కాబట్టి.. అంతేకాకుండా దేశంలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో బీసీసీఐ టోర్నీని ఏప్రిల్ 15 వరకు వాయిదా వేసింది. ఇక ఆ తర్వాత అయినా ఐపీఎల్‌ను […]

కరోనా ఎఫెక్ట్.. మినీ ఐపీఎల్‌కు ప్లాన్ రెడీ.!
Follow us on

Coronavirus Scare: కరోనా వైరస్ కారణంగా మార్చి 29 నుంచి జరగాల్సిన ఐపీఎల్ టోర్నమెంట్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. కోవిడ్ 19 వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కేంద్రం ఏప్రిల్ 15 వరకు విదేశీయుల వీసాలను రద్దు చేసింది. దీనితో విదేశీ ఆటగాళ్లు అప్పటివరకు సీజన్‌కు అందుబాటులో ఉండరు కాబట్టి.. అంతేకాకుండా దేశంలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో బీసీసీఐ టోర్నీని ఏప్రిల్ 15 వరకు వాయిదా వేసింది. ఇక ఆ తర్వాత అయినా ఐపీఎల్‌ను నిర్వహించాలా.. లేదా అన్న విషయాన్ని గంగూలీ ఫ్రాంచజీలతో శనివారం చర్చించారు.

గతంలో మాదిరి కాకుండా 8 జట్లను 2 గ్రూప్‌లుగా విభజించి మినీ ఐపీఎల్‌ను ప్లాన్ చేసేలా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక లీగ్ స్టేజ్ దాటి రెండు గ్రూపుల్లోనూ మొదటి రెండు స్థానాల్లో నిలిచిన 4 జట్లతో ప్లే ఆఫ్స్ నిర్వహించనున్నారు. అలాగే డబుల్ డెక్కర్ మ్యాచ్‌లను పెంచి.. ఎక్కువ వేదికల్లో కాకుండా రెండు లేదా మూడు వేదికల్లోనే నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోందని సమాచారం. అటు కొన్ని మ్యాచులను ప్రేక్షకులు లేకుండానే నిర్వహించాలని యోచిస్తున్నట్లు తెలిసింది. కాగా, టోర్నీని విదేశాల్లో నిర్వహించే యోచనలో తాము లేమని బీసీసీఐ అధ్యక్షుడు స్పష్టం చేశాడు.

For More News:

ఏపీ ప్రభుత్వం సంచలనం.. కాపరుల కోసం సరికొత్త పథకం.!

సీఎం సారూ. స్కూళ్లకు సెలవులు వద్దు..!

కరోనా ఎటాక్ @ సెకండ్ లెవెల్.. భారత్‌కు మిగిలింది 30 రోజులు మాత్రమే.!

రేవంత్ అక్రమాలు ఏపీలో కూడా.. టీఆర్ఎస్ నేత ఏమన్నారంటే.?

కరోనా ఎఫెక్ట్.. రసికప్రియులకు గుడ్ న్యూస్…

ఆ నలుగురితో వాట్సాప్ గ్రూప్.. ఆమేనా ఫస్ట్ లవ్ః ప్రదీప్

భారత్‌లో సెంచరీ దాటిన కరోనా కేసులు.. అత్యధికం మహారాష్ట్ర..